Political News

మిత్ర‌ప‌క్షం ‘మ‌హిళా కోటా’ ఇదీ..!

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు త‌గ్గిపోతున్నాయి. కానీ… పైకి మాత్రం 33 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు కావాల్సిందేన‌ని మాట‌ల తూటాలు పేల్చుతున్నాయి. క్షేత్ర‌స్థాయిలో కార్యాచ‌ర‌ణ‌కు వ‌చ్చే స‌రికి మాత్రం.. ఇది సాధ్యం కాని ప‌రిస్థితి నెల‌కొంది. సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉండ‌డ‌మో.. లేక‌.. మ‌హిళ‌ల‌కు ఇస్తే.. పురుష అభ్య‌ర్థుల‌కు కోపం వ‌స్తుంద‌నో.. కార‌ణం ఏదైనా కూడా.. టికెట్ల విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. తాజాగా టీడీపీ-జ‌న‌సేన ప్ర‌క‌టించిన తొలి జాబితాలో 99 ఎమ్మెల్యే సీట్ల‌కు అభ్య‌ర్థును ప్ర‌క‌టించారు.

మ‌రి 33 శాతం రిజ‌ర్వేష‌న్ మహిళ‌ల‌కు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన ఈ రెండు పార్టీలూ ఆమేర‌కు అమ‌లు చేశాయా? అంటే.. లేద‌నే చెప్పాలి. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు.. కూడిక‌లు, తీసివేతల అనంత‌రం.. కేవ‌లం 18 శాతం మందికి మాత్రమే మ‌హిళ‌ల‌కు టికెట్లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల వైసీపీ ప్ర‌క‌టించిన ఇంచార్జ్‌ల జాబితాలోనూ అన్యాయ‌మే జ‌రిగినా.. అక్క‌డ ప్ర‌క‌టించిన 73 స్థానాల్లో 28 శాతం మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు. దీనిని బ‌ట్టి అంతో ఇంతో వైసీపీ ప్రాధాన్యం ఇచ్చింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, టీడీపీ జ‌న‌సేన ప్ర‌క‌టించిన జాబితాలో కేవ‌లం 14 మంది మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే చోటు ద‌క్కింది.

ఇదీ.. మ‌హిళ‌ల జాబితా!

అనంత‌పురం జిల్లా పెనుకొండ- సవిత, రాప్తాడు- పరిటాల సునీత, సింగనమల(ఎస్సీ)- బండారు శ్రావణి

క‌ర్నూలు జిల్లా పాణ్యం- గౌరు చరితారెడ్డి, ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ

క‌డ‌ప జిల్లాలో కడప- మాధవిరెడ్డి

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట(ఎస్సీ)- విజయశ్రీ,

ఉమ్మ‌డి కృష్నా జిల్లా నందిగామ(ఎస్సీ)- తంగిరాల సౌమ్య

ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలో తుని- యనమల దివ్య

విశాఖ‌ప‌ట్నం జిల్లా పాయకరావుపేట(ఎస్సీ)- వంగలపూడి అనిత, అరకు(ఎస్టీ)-జగదీశ్వరి.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో సాలూరు(ఎస్టీ)- గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం-అదితి విజ‌య‌ల‌క్ష్మి గజపతిరాజు

శ్రీకాకుళం జిల్లాలో నెల్లిమర్ల-లోకం మాధవి(జనసేన)లకు టికెట్లు కేటాయించారు.

This post was last modified on February 25, 2024 10:29 am

Share
Show comments

Recent Posts

రాకా… ఈ కథ ఇప్పటిది కాదు

రాకా.. ఈ రోజు సోషల్ మీడియాను ఊపేస్తున్న పేరు. ఎక్స్‌ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పేరు టాప్‌లో…

2 hours ago

40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి…

4 hours ago

రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా: జగన్

వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు…

5 hours ago

బుచ్చిబాబు వేట ఇంకా పూర్తవ్వలేదా

ఏప్రిల్ 30 నుంచి తప్పుకున్నాక పెద్ది కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసింది కానీ దర్శకుడు బుచ్చిబాబుకి మాత్రం ఇటెమ్…

6 hours ago

క్యామియోల కోసం జైలర్ 2 తిప్పలు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి…

7 hours ago

పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది…

8 hours ago