తప్పు.. ఎక్కడ చేసినా పర్వాలేదు. సరిదిద్దుకోవచ్చు. కానీ, బలమైన ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉండగా.. తప్పు లు చేస్తే.. అవి కాస్తా ప్రజల్లోకి వెళ్తే.. కొంపే మునుగుతుంది. మరి ఈ విషయం ఆలోచించారో లేదో తెలియదు కానీ.. జనసేన ఇప్పుడు పెద్ద తప్పేచేసిందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమని.. తాజాగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 24 చోట్ల జనసేన పోటీ చేస్తుందనిస్వయంగా చంద్రబాబు చెప్పారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు.. టీడీపీ కంటే కూడా జనసేన అభ్యర్థుల జాబితా కోసం కళ్లు పెద్దవి చేసుకుని మరీ టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది. ఇక, జాబితాలు ప్రకటించడం మొదలయ్యాక.. జనసేన పై పెదవి విరుపు లు కనిపించడం మొదలయ్యాయి. ఇది పక్కా వాస్తవం. ఎందుకంటే.. 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామన్న జనసేన కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించి.. చేతులు దులుపుకొంది.
ఆ ఐదుగురు అభ్యర్థుల్లో తెనాలి – నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ ఉన్నారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, ఈ పరణామం రాజకీయంగా కూడా.. వివాదాలకు దారితీసింది. ఇప్పటికే వైసీపీ నాయకులు.. జనసేనకు అభ్యర్థులు లేరని..అందుకే 24 ప్రకటించి కూడా ఐదుగురు మాత్రమే అభ్యర్థులకు కేటాయించారని నిప్పులు చెరుగుతున్నారు.
అయితే.. దీనిలో కందుల దుర్గేష్, విజయవాడకు చెందిన పోతిన మహేష్, పార్టీ అధినేత పవన్, బొలిశెట్టి శ్రీనివాస్ వంటి వారిపేర్లు లేకపోవడం గమనార్హం. మరి మలిజాబితాలో అయినా ప్రకటిస్తారేమో చూడాలి. ఇలాంటప్పుడు.. 24 అని ప్రకటించడం ఎందుకు? అనేది ప్రశ్న.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…