తప్పు.. ఎక్కడ చేసినా పర్వాలేదు. సరిదిద్దుకోవచ్చు. కానీ, బలమైన ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉండగా.. తప్పు లు చేస్తే.. అవి కాస్తా ప్రజల్లోకి వెళ్తే.. కొంపే మునుగుతుంది. మరి ఈ విషయం ఆలోచించారో లేదో తెలియదు కానీ.. జనసేన ఇప్పుడు పెద్ద తప్పేచేసిందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమని.. తాజాగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 24 చోట్ల జనసేన పోటీ చేస్తుందనిస్వయంగా చంద్రబాబు చెప్పారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు.. టీడీపీ కంటే కూడా జనసేన అభ్యర్థుల జాబితా కోసం కళ్లు పెద్దవి చేసుకుని మరీ టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది. ఇక, జాబితాలు ప్రకటించడం మొదలయ్యాక.. జనసేన పై పెదవి విరుపు లు కనిపించడం మొదలయ్యాయి. ఇది పక్కా వాస్తవం. ఎందుకంటే.. 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామన్న జనసేన కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించి.. చేతులు దులుపుకొంది.
ఆ ఐదుగురు అభ్యర్థుల్లో తెనాలి – నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ ఉన్నారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, ఈ పరణామం రాజకీయంగా కూడా.. వివాదాలకు దారితీసింది. ఇప్పటికే వైసీపీ నాయకులు.. జనసేనకు అభ్యర్థులు లేరని..అందుకే 24 ప్రకటించి కూడా ఐదుగురు మాత్రమే అభ్యర్థులకు కేటాయించారని నిప్పులు చెరుగుతున్నారు.
అయితే.. దీనిలో కందుల దుర్గేష్, విజయవాడకు చెందిన పోతిన మహేష్, పార్టీ అధినేత పవన్, బొలిశెట్టి శ్రీనివాస్ వంటి వారిపేర్లు లేకపోవడం గమనార్హం. మరి మలిజాబితాలో అయినా ప్రకటిస్తారేమో చూడాలి. ఇలాంటప్పుడు.. 24 అని ప్రకటించడం ఎందుకు? అనేది ప్రశ్న.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…