రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేయబోతోన్న అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అని జగన్ అంటున్నారని, తాయు యుద్ధానికి సంసిద్ధం అయ్యామని పవన్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకే తాము పోరాడుతున్నామని పవన్ చెప్పారు. 60 నుంచి 70 సీట్లలో పోటీ చేయాలని తనతో చాలామంది పెద్దలు చెప్పారని అన్నారు. కానీ, గత ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలిచి ఉంటే 50 నుంచి 60 సీట్లు అడిగే అవకాశం ఉండేదని పవన్ అన్నారు.
అయితే, సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, పరిమిత సంఖ్యలో పోటీ చేసి ఎక్కువ స్థానాల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ తో గెలిచి చూపించాలని తాను భావిస్తున్నానని పవన్ అన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తమ సీట్లు తగ్గించుకుంటున్నామని చెప్పారు. బీజేపీ ఆశీర్వాదం జనసేన-టీడీపీ కూటమికి ఉంటుందని, బీజేపీతో చర్చలు తుది రూపుదిద్దుకున్నాక ఆ సీట్లపై క్లారిటీ వస్తుందని పవన్ చెప్పారు. ఇక, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
అయితే, జనసేనకు పనిచేసిన ప్రతి ఒక్కరికి తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని ఓడించేందుకే జనసేన-టీడీపీ కూటమి ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి విజయం తధ్యమని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను సరైన మార్గంలో పెట్టేందుకే తమ కూటమి ముమ్మరంగా ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇప్పటం నుంచి ఈరోజు వరకు ఎంతో ఓపిగ్గా ఉంటూ ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో ఆటుపోట్లను భరించామని చెప్పారు.
This post was last modified on February 24, 2024 2:36 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…