రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేయబోతోన్న అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అని జగన్ అంటున్నారని, తాయు యుద్ధానికి సంసిద్ధం అయ్యామని పవన్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకే తాము పోరాడుతున్నామని పవన్ చెప్పారు. 60 నుంచి 70 సీట్లలో పోటీ చేయాలని తనతో చాలామంది పెద్దలు చెప్పారని అన్నారు. కానీ, గత ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలిచి ఉంటే 50 నుంచి 60 సీట్లు అడిగే అవకాశం ఉండేదని పవన్ అన్నారు.
అయితే, సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, పరిమిత సంఖ్యలో పోటీ చేసి ఎక్కువ స్థానాల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ తో గెలిచి చూపించాలని తాను భావిస్తున్నానని పవన్ అన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తమ సీట్లు తగ్గించుకుంటున్నామని చెప్పారు. బీజేపీ ఆశీర్వాదం జనసేన-టీడీపీ కూటమికి ఉంటుందని, బీజేపీతో చర్చలు తుది రూపుదిద్దుకున్నాక ఆ సీట్లపై క్లారిటీ వస్తుందని పవన్ చెప్పారు. ఇక, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
అయితే, జనసేనకు పనిచేసిన ప్రతి ఒక్కరికి తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని ఓడించేందుకే జనసేన-టీడీపీ కూటమి ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి విజయం తధ్యమని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను సరైన మార్గంలో పెట్టేందుకే తమ కూటమి ముమ్మరంగా ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇప్పటం నుంచి ఈరోజు వరకు ఎంతో ఓపిగ్గా ఉంటూ ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో ఆటుపోట్లను భరించామని చెప్పారు.
This post was last modified on February 24, 2024 2:36 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…