తాజాగా ప్రకటించిన టీడీపీ తొలి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కనిపించలేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. పేరు..తాజా జాబితాలో లేకపోవడంతో ఆయనకు ఎక్కడ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఆయన విశాఖ పరిధిలోని భీమిలి లేదా పెందుర్తి నుంచి టికెట్ కావాలని కోరుతున్నారు. అయితే.. రెండు రోజుల నుంచి ఆయన పేరు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంపరిశీలనలో ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఇక, దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. వైసీపీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ఎవరు వచ్చి పోటీ చేసినా ఓడిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలువరించిన జాబితాలో ఎక్కడా గంటా పేరు కనిపించలేదు. పైగా ఆయన ఎదురు చూస్తున్న భీమిలి నుంచి జనసేనకు కేటాయించారు. ఈ పార్టీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాదవ్ పోటీ చేయనున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం చాలా కష్టం.
ఇక, గంటా ఆశించిన మరో నియోజకవర్గం పెందుర్తి. ఇక్కడ కూడా.. జనసేన పోటీ చేయనుంది. జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్బాబును ప్రకటించారు. పోనీ.. గాజువాక అయినా.. టీడీపీ తీసుకుని ఉంటే బాగుండేదనే వాదన ఉంది. కానీ, ఇక్కడ కూడా జనసేనకు ఇచ్చేశారు. ఈ పార్టీ తరఫున సుందరపు సతీష్కుమార్కు అవకాశం ఇచ్చారు. ఇలా.. గంటా శ్రీనివాసరావుకు దాదాపు విశాఖనగర పరిధిలో చోటు లేకపోవడం గమనార్హం. మరోవైపు.. విశాఖ ఉత్తరం కూడా మిగిలే పరిస్థితి లేదు. రేపు బీజేపీతో పొత్తు ఉంటే ఆ సీటును.. బీజేపీ అభ్యర్థి.. విష్ణుకుమార్రాజుకు కేటాయించాల్సి ఉంటుంది. మరి గంటా కు ఏ సీటు ఇస్తారో చూడాలి.
This post was last modified on February 24, 2024 2:36 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…