టీడీపీ-జనసేన కూటమి తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు.
ఈ రోజు 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతోపాటు 3 పార్లమెంట్ సీట్లు కేటాయించారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీతో పొత్తు విషయం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.
జనసేన తరఫున తెనాలి అసెంబ్లీ బరిలో నాదెండ్ల మనోహర్ నిలుచోబోతున్నారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయనతో పాటు మరో నలుగురు అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు. ఇక, టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. హిందూపురం నుంచి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేశ్, కుప్పం నుంచి తాను, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి పూసపాటి అదితి గజపతి రాజు పోటీ చేయబోతున్నారని తెలిపారు.
వైజాగ్ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, వైజాగ్ వెస్ట్ పీజీబీఆర్ నాయుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత ,నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని నుంచి యనమల దివ్య పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత మిగతా అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
2026 సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏదో నిన్నా మొన్నా కొత్త సంవత్సరం జరుపుకున్నట్టు ఉంది కానీ కాలం కర్పూరంలా…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్…
షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు…
ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…
అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…
ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం జూలై 9 విడుదలని మొన్నటి దాకా టీమ్…