టీడీపీ-జనసేన కూటమి తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు.
ఈ రోజు 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతోపాటు 3 పార్లమెంట్ సీట్లు కేటాయించారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీతో పొత్తు విషయం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.
జనసేన తరఫున తెనాలి అసెంబ్లీ బరిలో నాదెండ్ల మనోహర్ నిలుచోబోతున్నారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయనతో పాటు మరో నలుగురు అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు. ఇక, టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. హిందూపురం నుంచి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేశ్, కుప్పం నుంచి తాను, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి పూసపాటి అదితి గజపతి రాజు పోటీ చేయబోతున్నారని తెలిపారు.
వైజాగ్ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, వైజాగ్ వెస్ట్ పీజీబీఆర్ నాయుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత ,నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని నుంచి యనమల దివ్య పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత మిగతా అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…