Political News

వైసీపీకి ఎంపీ ర‌ఘురామ రాజీనామా

ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు, ఫైర్ బ్రాండ్ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. త‌న రాజీనామాను త్వ‌ర‌గా.. సాధ్య‌మైనంత వేగంగా ఆమోదించాల‌ని ఆయ‌న కోరారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కు ఆయ‌న నేరుగా అధికారిక ప‌త్రంపై లేఖ‌ను పంపించారు. “మీరు న‌న్ను అన‌ర్హుడినిచేయాల‌ని అనుకున్నా.. న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును ప్ర‌జాస్వామ్యం గౌర‌వించి.. న‌న్ను కాపాడింది” అని పేర్కొన్నారు.

న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఎన్నుకున్నందుకు..వారికి తాను ఎంతో దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. సేవ‌ల విష‌యంలో మాత్రం లోటు రాలేద‌ని చెప్పారు. మీరు ఆశించిన ఫ‌లితం ద‌క్క‌నందుకు నేను కూడా ఒక‌ప్పుడు చింతించాన‌ని పేర్కొన్నారు. (ఎంపీగా అన‌ర్హ‌త వేటు వేయించ‌డంలో) అంద‌రం ప్ర‌జాతీర్పు కోర‌వ‌ల‌సిన అవ‌స‌రం, స‌మ‌యం రెండూ వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. న‌ర‌సాపురం స‌మ‌గ్ర అభివృద్ధికి ఎన‌లేని సేవ చేసిన‌ట్టు ర‌ఘురామ తెలిపారు. ఈ నేప‌థ్యంలో పార్టీకి, క్రియాశీల‌క స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

రెబ‌ల్‌గా 4 ఏళ్లు!

కాగా, 2019 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావరి జిల్లా నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కేవ‌లం ఏడాది కాలంలోనే పార్టీకి రెబ‌ల్‌గా మారారు. స్థానికంగా.. ఉన్న వైసీపీ నాయ‌కుల ప్ర‌భావం, వారి ఆదిప‌త్యంతో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా ర‌ఘురామ‌.. పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో రెండుసార్లు.. పార్టీ నుంచి చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ ఏదోతేడా మాత్రం కొన‌సాగింది. దీనికితోడు ఎంపీ అనుచ‌రుల‌పై స్థానిక ఎమ్మెల్యేలు..కేసులు పెట్ట‌డం.. ఆయ‌న ఫ్లెక్సీలు పెట్ట‌కుండా అడ్డుకోవ‌డం వంటి ప‌రిణామాల‌తో ప్రారంభ‌మైన వివాదాలు.. రెబ‌ల్‌గా మారే వ‌ర‌కు సాగాయి.

This post was last modified on February 24, 2024 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago