ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్లమెంటు సభ్యుడు, ఫైర్ బ్రాండ్ కనుమూరి రఘురామకృష్ణరాజు.. తాజాగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను త్వరగా.. సాధ్యమైనంత వేగంగా ఆమోదించాలని ఆయన కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఆయన నేరుగా అధికారిక పత్రంపై లేఖను పంపించారు. “మీరు నన్ను అనర్హుడినిచేయాలని అనుకున్నా.. నరసాపురం ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యం గౌరవించి.. నన్ను కాపాడింది” అని పేర్కొన్నారు.
నరసాపురం ప్రజలు ఎన్నుకున్నందుకు..వారికి తాను ఎంతో దూరంగా ఉన్నప్పటికీ.. సేవల విషయంలో మాత్రం లోటు రాలేదని చెప్పారు. మీరు ఆశించిన ఫలితం దక్కనందుకు నేను కూడా ఒకప్పుడు చింతించానని పేర్కొన్నారు. (ఎంపీగా అనర్హత వేటు వేయించడంలో) అందరం ప్రజాతీర్పు కోరవలసిన అవసరం, సమయం రెండూ వచ్చాయని పేర్కొన్నారు. నరసాపురం సమగ్ర అభివృద్ధికి ఎనలేని సేవ చేసినట్టు రఘురామ తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీకి, క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రెబల్గా 4 ఏళ్లు!
కాగా, 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైసీపీ టికెట్పై విజయం దక్కించుకున్న కనుమూరి రఘురామకృష్ణరాజు.. కేవలం ఏడాది కాలంలోనే పార్టీకి రెబల్గా మారారు. స్థానికంగా.. ఉన్న వైసీపీ నాయకుల ప్రభావం, వారి ఆదిపత్యంతో ఏర్పడిన విభేదాల కారణంగా రఘురామ.. పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో రెండుసార్లు.. పార్టీ నుంచి చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఏదోతేడా మాత్రం కొనసాగింది. దీనికితోడు ఎంపీ అనుచరులపై స్థానిక ఎమ్మెల్యేలు..కేసులు పెట్టడం.. ఆయన ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలతో ప్రారంభమైన వివాదాలు.. రెబల్గా మారే వరకు సాగాయి.
This post was last modified on February 24, 2024 12:02 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…