ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్లమెంటు సభ్యుడు, ఫైర్ బ్రాండ్ కనుమూరి రఘురామకృష్ణరాజు.. తాజాగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను త్వరగా.. సాధ్యమైనంత వేగంగా ఆమోదించాలని ఆయన కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఆయన నేరుగా అధికారిక పత్రంపై లేఖను పంపించారు. “మీరు నన్ను అనర్హుడినిచేయాలని అనుకున్నా.. నరసాపురం ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యం గౌరవించి.. నన్ను కాపాడింది” అని పేర్కొన్నారు.
నరసాపురం ప్రజలు ఎన్నుకున్నందుకు..వారికి తాను ఎంతో దూరంగా ఉన్నప్పటికీ.. సేవల విషయంలో మాత్రం లోటు రాలేదని చెప్పారు. మీరు ఆశించిన ఫలితం దక్కనందుకు నేను కూడా ఒకప్పుడు చింతించానని పేర్కొన్నారు. (ఎంపీగా అనర్హత వేటు వేయించడంలో) అందరం ప్రజాతీర్పు కోరవలసిన అవసరం, సమయం రెండూ వచ్చాయని పేర్కొన్నారు. నరసాపురం సమగ్ర అభివృద్ధికి ఎనలేని సేవ చేసినట్టు రఘురామ తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీకి, క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రెబల్గా 4 ఏళ్లు!
కాగా, 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైసీపీ టికెట్పై విజయం దక్కించుకున్న కనుమూరి రఘురామకృష్ణరాజు.. కేవలం ఏడాది కాలంలోనే పార్టీకి రెబల్గా మారారు. స్థానికంగా.. ఉన్న వైసీపీ నాయకుల ప్రభావం, వారి ఆదిపత్యంతో ఏర్పడిన విభేదాల కారణంగా రఘురామ.. పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో రెండుసార్లు.. పార్టీ నుంచి చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఏదోతేడా మాత్రం కొనసాగింది. దీనికితోడు ఎంపీ అనుచరులపై స్థానిక ఎమ్మెల్యేలు..కేసులు పెట్టడం.. ఆయన ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలతో ప్రారంభమైన వివాదాలు.. రెబల్గా మారే వరకు సాగాయి.
This post was last modified on February 24, 2024 12:02 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…