Political News

నేను నోరు విప్పడ‌మే త‌ప్పా?!: నారా భువ‌నేశ్వ‌రి

“నేను నోరు విప్ప‌డ‌మే త‌ప్పా. నేను మాట్లాడిన దానిలోనూ రాజకీయాలు చూస్తారా? రాజ‌కీయాలు చేస్తారా?” అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల చిత్తూరులో ప‌ర్య‌టించిన ఆమె.. “మా ఆయ‌న‌కు రెస్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాను.. మీ ఉద్దేశం ఏంటి? నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?” అని మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నించారు. దీనికి స‌ద‌రు మ‌హిళ‌లు.. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రూ పోటీ చేయండి గెలిపించుకుంటాం! అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నాయ‌కులు వేరే కోణంలో తీసుకుని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు.

చంద్ర‌బాబుకు రెస్ట్ ఇవ్వాల‌ని.. ఆయ‌న స‌తీమ‌ణే కోరుకుంటున్నార‌ని.. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు రెస్ట్ ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త అన్నారు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబుకు వ్య‌క్తిగ‌త జీవితంలో ప్ర‌శాంతంగా జీవించేందుకు మ‌నమే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, తాజాగా సీఎం జ‌గ‌న్ కూడా ఒంగోలులో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు రెస్టు కావాల‌ని ఆయ‌న భార్యే కోరుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా.. ఆదిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని కోరుతున్నాన‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నారా భువ‌నేశ్వ‌రి స్పందించారు.

“నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మోహన్ నాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ క్రమంలో మోహన్ కుటుంబ సభ్యులను భువనేశ్వ‌రి ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఈ కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. మోహన్ నాయుడు పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉచిత విద్య అందిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ.. “నేను నోరు విప్పితే త‌ప్పుబ‌డుతున్నారు. ఏం మాట్లాడాలి. ఏం మాట్లాడినా కూడా రాజ‌కీయం చేస్తారా? ఇదేం ప‌ద్ధ‌తి. మాజీ సీఎం భార్య‌కు మాట్లాడే హ‌క్కులేదా? ప్ర‌తి విష‌యాన్నీ.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన విధంగా బుద్ధి చెప్పాలి. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావ‌డం లేదు. నా భ‌ర్త గురించి నేను మాట్లాడితే ఇలా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తారా” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 23, 2024 11:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago