Political News

నేను నోరు విప్పడ‌మే త‌ప్పా?!: నారా భువ‌నేశ్వ‌రి

“నేను నోరు విప్ప‌డ‌మే త‌ప్పా. నేను మాట్లాడిన దానిలోనూ రాజకీయాలు చూస్తారా? రాజ‌కీయాలు చేస్తారా?” అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల చిత్తూరులో ప‌ర్య‌టించిన ఆమె.. “మా ఆయ‌న‌కు రెస్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాను.. మీ ఉద్దేశం ఏంటి? నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?” అని మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నించారు. దీనికి స‌ద‌రు మ‌హిళ‌లు.. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రూ పోటీ చేయండి గెలిపించుకుంటాం! అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నాయ‌కులు వేరే కోణంలో తీసుకుని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు.

చంద్ర‌బాబుకు రెస్ట్ ఇవ్వాల‌ని.. ఆయ‌న స‌తీమ‌ణే కోరుకుంటున్నార‌ని.. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు రెస్ట్ ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త అన్నారు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబుకు వ్య‌క్తిగ‌త జీవితంలో ప్ర‌శాంతంగా జీవించేందుకు మ‌నమే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, తాజాగా సీఎం జ‌గ‌న్ కూడా ఒంగోలులో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు రెస్టు కావాల‌ని ఆయ‌న భార్యే కోరుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా.. ఆదిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని కోరుతున్నాన‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నారా భువ‌నేశ్వ‌రి స్పందించారు.

“నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మోహన్ నాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ క్రమంలో మోహన్ కుటుంబ సభ్యులను భువనేశ్వ‌రి ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఈ కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. మోహన్ నాయుడు పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉచిత విద్య అందిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ.. “నేను నోరు విప్పితే త‌ప్పుబ‌డుతున్నారు. ఏం మాట్లాడాలి. ఏం మాట్లాడినా కూడా రాజ‌కీయం చేస్తారా? ఇదేం ప‌ద్ధ‌తి. మాజీ సీఎం భార్య‌కు మాట్లాడే హ‌క్కులేదా? ప్ర‌తి విష‌యాన్నీ.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన విధంగా బుద్ధి చెప్పాలి. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావ‌డం లేదు. నా భ‌ర్త గురించి నేను మాట్లాడితే ఇలా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తారా” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 23, 2024 11:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago