ఏపీలో అసెంబ్లీఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమున కలుగా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు వేసే అడుగులకు.. చెక్ పెడుతూ.. నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య పోటీ.. మరింత వేగంగా ఉంది. తాజాగా ఉమ్మడి కృష్నా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. పెనమలూరు నుంచి వైసీపీ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. పొరుగున ఉన్న పెడన ఎమ్మెల్యే కమ్ మంత్రి జోగి రమేష్ను తీసుకువచ్చి.. ఇక్కడ ఇంచార్జ్ గా నియమించారు.
దీంతో టీడీపీ డిఫెన్స్లో పడింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున కమ్మ సామాజిక వర్గా నికి చెందిన బోడే ప్రసాద్ పోటీ చేస్తూ వస్తున్నారు. 2014లో ఆయన విజయం దక్కించుకున్నారు, 2019లో ఓడిపోయారు. ఈ సారి.. ఇక్కడ మారిన సమీకరణల నేపథ్యంలోవైసీపీని బలంగా ఎదుర్కొనే విషయంపై కొన్నాళ్లుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పేరు తెరమీదికి వచ్చింది. తెలుగు సినీ రంగంలో సూపర్ స్టార్గా వెలుగొందిన నటశేఖర కృష్ణ సోదరుడు.. ఆదిశేషగిరి రావును బరిలో దింపాలని భావిస్తున్నట్టు తాజాగా వెలుగు చూసింది.
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కమ్మసామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కూడా చేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత.. వైసీపీ చెంతకు చేరారు. ఆయనకు ఇక్కడ ఆశించిన మేరకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో రెండు సంవత్సరాలుగా వైసీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆది శేషగిరిరావునుబరిలో నిలపడం ద్వారా.. వైసీపీకి గట్టి షాక్ ఇవ్వచ్చనేది.. టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు..ఆయన రాకతో.. కమ్మ సామాజిక వర్గం పూర్తిగా తమ వెనుకే ఉంటుందని కూడా లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.
కృష్ణ కుటుంబానికి.. ఆది నుంచి కూడా.. టీడీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన సొంత అల్లుడు.. గల్లా జయదేవ్కు.. 2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లోనూ ఇదే సీటు కేటాయించారు. మరోసారి వైసీపీ హవాను ఎదిరించి మరీ గెలుపు గుర్రం ఎక్కారు. ఇటీవల గల్లా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో కృష్ణ కుటుంబానికే చెందిన ఆదిశేషగిరిరావుకు ఈ దఫా ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…