Political News

పెన‌మూలూరు నుంచి హీరో కృష్ణ సోద‌రుడు పోటీ?!

ఏపీలో అసెంబ్లీఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో పార్టీ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో త‌ల‌మున కలుగా ఉన్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీలు వేసే అడుగుల‌కు.. చెక్ పెడుతూ.. నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీల మ‌ధ్య పోటీ.. మ‌రింత వేగంగా ఉంది. తాజాగా ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం.. పెన‌మ‌లూరు నుంచి వైసీపీ ప్ర‌యోగం చేసిన విష‌యం తెలిసిందే. పొరుగున ఉన్న పెడ‌న ఎమ్మెల్యే క‌మ్ మంత్రి జోగి ర‌మేష్‌ను తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ ఇంచార్జ్ గా నియ‌మించారు.

దీంతో టీడీపీ డిఫెన్స్‌లో ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున క‌మ్మ సామాజిక వ‌ర్గా నికి చెందిన బోడే ప్ర‌సాద్ పోటీ చేస్తూ వ‌స్తున్నారు. 2014లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు, 2019లో ఓడిపోయారు. ఈ సారి.. ఇక్క‌డ మారిన స‌మీక‌ర‌ణ‌ల  నేప‌థ్యంలోవైసీపీని బ‌లంగా ఎదుర్కొనే విష‌యంపై కొన్నాళ్లుగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొత్త పేరు తెర‌మీదికి వ‌చ్చింది. తెలుగు సినీ రంగంలో సూప‌ర్ స్టార్‌గా వెలుగొందిన న‌ట‌శేఖ‌ర కృష్ణ సోద‌రుడు.. ఆదిశేష‌గిరి రావును బ‌రిలో దింపాల‌ని భావిస్తున్న‌ట్టు తాజాగా వెలుగు చూసింది.

ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ కూడా చేశారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. వైసీపీ చెంత‌కు చేరారు. ఆయ‌న‌కు ఇక్క‌డ ఆశించిన మేర‌కు ప్రాధాన్యం ద‌క్క‌లేదు. దీంతో రెండు సంవ‌త్స‌రాలుగా వైసీపీకి ఆయ‌న దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆది శేష‌గిరిరావునుబ‌రిలో నిల‌ప‌డం ద్వారా.. వైసీపీకి గ‌ట్టి షాక్ ఇవ్వ‌చ్చ‌నేది.. టీడీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు..ఆయ‌న రాక‌తో.. క‌మ్మ సామాజిక వ‌ర్గం పూర్తిగా త‌మ వెనుకే ఉంటుంద‌ని కూడా లెక్క‌లు వేస్తున్న‌ట్టు స‌మాచారం.

కృష్ణ కుటుంబానికి.. ఆది నుంచి కూడా.. టీడీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఆయ‌న సొంత అల్లుడు.. గ‌ల్లా జ‌య‌దేవ్‌కు.. 2014 ఎన్నిక‌ల్లో గుంటూరు పార్ల‌మెంటు టికెట్ ఇచ్చారు చంద్ర‌బాబు. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. 2019లోనూ ఇదే సీటు కేటాయించారు. మ‌రోసారి వైసీపీ హవాను ఎదిరించి మ‌రీ గెలుపు గుర్రం ఎక్కారు. ఇటీవ‌ల గ‌ల్లా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో కృష్ణ కుటుంబానికే చెందిన ఆదిశేష‌గిరిరావుకు ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

This post was last modified on February 23, 2024 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago