Political News

సీఎం జ‌గ‌న్ హెలికాప్ట‌ర్లు.. ర‌ఘురామ ఫిర్యాదు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం వినియోగించేలా రెండు హెలికాప్ట‌ర్ల‌ను లీజుకు తీసుకు నేందుకు ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. దీనికి గాను ఒక్కొక్క హెలికాప్ట‌ర్‌కు 2 కోట్ల రూపాయ‌ల చొప్పున ప్ర‌జాధ‌నాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని దానిలో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఎన్నిక‌ల నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌జ‌ల సొమ్మును వినియోగించి విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ర‌ఘురామ స‌ద‌రు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్ర‌చారానికి స‌ర్కారు ఖ‌జానా నుంచి సొమ్ములు వెచ్చించ‌డం నియ‌మావ‌ళికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. హెలికాప్టర్లను లీజుకు తీసుకునే వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకోవాల‌ని.. వాటిని నిలువ‌రించాల‌ని ఆయ‌న కోరారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ వినియోగించే రెండు హెలికాప్టర్లకు నెలకు  4 కోట్ల రూపాయ‌ల చొప్పు న‌ ఖర్చు చేస్తున్నారని ర‌ఘురామ వివ‌రించారు.  వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడా నికే ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్య‌యాన్ని రేపు ఎన్నిక‌ల సంఘానికి చూపించాల్సి ఉంటుంద‌ని, అందుకే ముందుగానే ఈ ఎత్తుగ‌డ వేశార‌ని, వ్య‌యం నుంచి తప్పించుకోవ డానికే జగన్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ హెలికాప్టర్లలోనే భారీగా నగదును తరలించే అవ‌కాశం ఉంద‌ని ఎంపీ ర‌ఘురామ అనుమానాలువ్య‌క్తం చేశారు. హెలికాప్టర్ల వాడకాన్ని అడ్డుకోవాలని సీఈసీని కోరారు. హెలికాప్టర్లను తనిఖీలు చేసేందుకు కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని త‌న ఫిర్యాదులో కోరారు. మొత్తం 12 పేజీల‌తో కూడిన ఫిర్యాదును ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. మ‌రి దీనిపై ఈసీ ఎలాంటి నిర్న‌యం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on February 23, 2024 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

4 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago