Political News

సీఎం జ‌గ‌న్ హెలికాప్ట‌ర్లు.. ర‌ఘురామ ఫిర్యాదు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం వినియోగించేలా రెండు హెలికాప్ట‌ర్ల‌ను లీజుకు తీసుకు నేందుకు ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. దీనికి గాను ఒక్కొక్క హెలికాప్ట‌ర్‌కు 2 కోట్ల రూపాయ‌ల చొప్పున ప్ర‌జాధ‌నాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని దానిలో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఎన్నిక‌ల నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌జ‌ల సొమ్మును వినియోగించి విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ర‌ఘురామ స‌ద‌రు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్ర‌చారానికి స‌ర్కారు ఖ‌జానా నుంచి సొమ్ములు వెచ్చించ‌డం నియ‌మావ‌ళికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. హెలికాప్టర్లను లీజుకు తీసుకునే వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకోవాల‌ని.. వాటిని నిలువ‌రించాల‌ని ఆయ‌న కోరారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ వినియోగించే రెండు హెలికాప్టర్లకు నెలకు  4 కోట్ల రూపాయ‌ల చొప్పు న‌ ఖర్చు చేస్తున్నారని ర‌ఘురామ వివ‌రించారు.  వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడా నికే ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్య‌యాన్ని రేపు ఎన్నిక‌ల సంఘానికి చూపించాల్సి ఉంటుంద‌ని, అందుకే ముందుగానే ఈ ఎత్తుగ‌డ వేశార‌ని, వ్య‌యం నుంచి తప్పించుకోవ డానికే జగన్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ హెలికాప్టర్లలోనే భారీగా నగదును తరలించే అవ‌కాశం ఉంద‌ని ఎంపీ ర‌ఘురామ అనుమానాలువ్య‌క్తం చేశారు. హెలికాప్టర్ల వాడకాన్ని అడ్డుకోవాలని సీఈసీని కోరారు. హెలికాప్టర్లను తనిఖీలు చేసేందుకు కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని త‌న ఫిర్యాదులో కోరారు. మొత్తం 12 పేజీల‌తో కూడిన ఫిర్యాదును ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. మ‌రి దీనిపై ఈసీ ఎలాంటి నిర్న‌యం తీసుకుంటుందో చూడాలి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

2 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

5 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago