జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీసీలను టార్గెట్ చేశారా? ఇప్పటి వరకు కాపు నేతలే ఆయనను సమర్థిస్తున్న నేపథ్యంలో ఆయన అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారా? ఈ క్రమంలో బీసీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి.బీసీల్లో ఐక్యత లోపించిందని.. పవన్ అన్నారు. దీనినే వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుని.. బీసీలను ఒక ఆట ఆడిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తనకు మాత్రమే అబ్బిన విష సంస్కృతిని కుటుంబాలకు కూడా వ్యాపింప జేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
“బీసీల మధ్య సఖ్యత లేదు. అందుకే.. వారంతా జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. దేహీ అని పదవుల కోసం అర్థిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. వారిలో చైతన్యం తీసుకురావాలి. ఐక్యతగా ఉంటే.. వారిని మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పడం తథ్యం. అణగారిన కులాలు అభివృద్ధి సాధించాలంటే, ఇతర కులాలను తొక్కేయడం కాదు. అన్ని కులాలను సాధికారత దిశగా తీసుకువెళ్ళడం. ఆ పని మనం చేస్తాం. రాజకీయాల్లో కూడా రిటైర్ మెంట్ అవసరం. కొత్త తరం వారికి అవకాశం ఇవ్వాలంటే, ఇది తప్పదు” అని పవన్ వ్యాఖ్యానించారు.
షర్మిల ఆస్తులు లాగేసుకున్నాడు!
సీఎం జగన్.. తన సొంత ఆస్తులనే లాగేసుకున్నాడని పవన్ వ్యాఖ్యానించారు. “దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా సంపాయించారో తెలియదు కానీ, బాగానే సంపాయించారని అంటారు. ఆయన కుమార్తెగా ఆ ఆస్తుల్లోనూ షర్మిలకు వాటా ఉంది. మన ఆస్తుల్లో మన అక్క చెల్లెళ్లకు మనం వాటాలు ఇవ్వడం లేదా? కానీ.. ఈ జగన్ మాత్రం షర్మిలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని బయటకు గెంటేశాడు. ఇలాంటివాడు మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని మహిళల ఆస్తులకు భద్రత ఉండదని నేను విశ్వసిస్తున్నా. జగన్ వ్యతిరేకించడంలో ఇది కూడా ఒక కారణం. అందుకే ఆయన ప్రభుత్వం మళ్లీ రాకూడదు” అని పవన్ అన్నారు.
This post was last modified on February 21, 2024 10:43 pm
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…