ఏపీ సీఎం జగన్ విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ శారదాపీఠం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం ఉత్సవాల ముగింపు ను పురస్కరించుకున్ని సీఎం జగన్ వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారిగా అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. అదేవిధంగా అరగంటకు పైగా.. శారదా పీఠం స్వామీజీతో సీఎం జగన్ చర్చలు జరిపారు.
త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ రాజశ్యామల అమ్మవారి యాగంలో ఆయన పాల్గొని పూజలు చేయడం గమనార్హం. సంప్రదాయ వస్త్ర ధారణలో రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూర్ణాహుతి నిర్వహించారు. ప్రత్యేకంగా ఆయన కోసం యాగశాలను ఏర్పాటు చేశారు. కాగా, గత ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇక్కడ నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఈయన కోసం స్వామి స్వరూపానంద ప్రత్యేకంగా యాగం చేశారు.
కామ్రెడ్ల నిర్బంధం
ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయనను ఘెరావ్ చేసేందుకు వామపక్షాల నేతలు ప్రయత్నించారు. ముఖ్యంగా ఉద్యోగులు సమస్యలు, డీఎస్సీ వంటి అంశాలను లేవనెత్తాలని వారు ప్రయత్నించారు. అయితే.. వామపక్ష నేతలను పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాన్ని దాదాపు అష్టదిగ్భంధం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. దారి పొడవునా డ్వాక్రా మహిళలు.. సిద్ధం పోస్టర్లు జగన్మోహన్, స్వాగతం పలుకుతూ, మానవహారంగా ఏర్పాటు చేశారు.
This post was last modified on February 21, 2024 4:40 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…