Political News

ఆశీస్సులు-ఆశీస్సులు.. శార‌దా పీఠంలో సీఎం జ‌గ‌న్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ విశాఖ‌లోని చిన‌ముషిడివాడ‌లో ఉన్న శార‌దా పీఠాన్ని ద‌ర్శించుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఇక్క‌డ శారదాపీఠం వార్షికోత్సవాలు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ఉత్స‌వాల‌ ముగింపు ను పుర‌స్క‌రించుకున్ని సీఎం జ‌గ‌న్ వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారిగా అమ్మ‌వారికి సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. అదేవిధంగా అరగంటకు పైగా.. శార‌దా పీఠం స్వామీజీతో సీఎం జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రిపారు.

త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారి యాగంలో ఆయన పాల్గొని పూజ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. సంప్ర‌దాయ వ‌స్త్ర ధార‌ణ‌లో రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారికి సీఎం జ‌గ‌న్ పూర్ణాహుతి నిర్వ‌హించారు. ప్ర‌త్యేకంగా ఆయ‌న కోసం యాగ‌శాల‌ను ఏర్పాటు చేశారు. కాగా, గ‌త ఎన్నికలకు ముందు కూడా జ‌గ‌న్ ఇక్క‌డ నిర్వ‌హించిన రాజ‌శ్యామ‌ల యాగంలో పాల్గొన్నారు. ఈయ‌న కోసం స్వామి స్వ‌రూపానంద ప్ర‌త్యేకంగా యాగం చేశారు.

కామ్రెడ్ల నిర్బంధం

ముఖ్యమంత్రి విశాఖ ప‌ర్య‌ట‌న నేపథ్యంలో ఆయ‌న‌ను ఘెరావ్ చేసేందుకు వామపక్షాల నేతలు ప్ర‌య‌త్నించారు. ముఖ్యంగా ఉద్యోగులు స‌మ‌స్య‌లు, డీఎస్సీ వంటి అంశాలను లేవనెత్తాల‌ని వారు ప్ర‌య‌త్నించారు. అయితే.. వామ‌ప‌క్ష నేత‌ల‌ను పోలీసులు మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ప్ర‌యాణించే మార్గాన్ని దాదాపు అష్ట‌దిగ్భంధం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. దారి పొడవునా డ్వాక్రా మహిళలు.. సిద్ధం పోస్టర్లు జగన్మోహన్, స్వాగతం పలుకుతూ, మానవహారంగా ఏర్పాటు చేశారు.

This post was last modified on February 21, 2024 4:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago