తెలుగుదేశం యువ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నెమ్మదిగా దూకుడు పెంచుతున్నారు. ఒక వైకాపా నేత హత్య కేసులో చిక్కుకుని.. ఇటీవలే బెయిల్ మీద బయటికి వచ్చిన తెదేపా నేత కొల్లు రవీంద్రను బుధవారం లోకేష్ పరామర్శించారు. ఆయన వెంట దేవినేని ఉమా సహా పలువురు తెదేపా అగ్ర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా అధికార పార్టీ నేతల్నుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు నారా లోకేష్. వైకాపా నాయకుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్న లోకేష్.. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, జగన్ రెడ్డి గారి అసమర్ధ పాలనని ఎండగడుతున్నారనే అక్కసుతోనే కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపిస్తామని.. అప్పుడు 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల మీద పెట్టిన తప్పుడు కేసులను మరిచిపోయేది లేదని.. అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని.. అడ్డదారులు తొక్కుతున్న వైకాపా నాయకులకు వడ్డీతో సహా అన్నీ చెల్లించి తీరుతామని లోకేష్ హెచ్చరించడం విశేషం.
This post was last modified on September 9, 2020 10:04 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…