తెలుగుదేశం యువ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నెమ్మదిగా దూకుడు పెంచుతున్నారు. ఒక వైకాపా నేత హత్య కేసులో చిక్కుకుని.. ఇటీవలే బెయిల్ మీద బయటికి వచ్చిన తెదేపా నేత కొల్లు రవీంద్రను బుధవారం లోకేష్ పరామర్శించారు. ఆయన వెంట దేవినేని ఉమా సహా పలువురు తెదేపా అగ్ర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా అధికార పార్టీ నేతల్నుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు నారా లోకేష్. వైకాపా నాయకుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్న లోకేష్.. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, జగన్ రెడ్డి గారి అసమర్ధ పాలనని ఎండగడుతున్నారనే అక్కసుతోనే కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపిస్తామని.. అప్పుడు 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల మీద పెట్టిన తప్పుడు కేసులను మరిచిపోయేది లేదని.. అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని.. అడ్డదారులు తొక్కుతున్న వైకాపా నాయకులకు వడ్డీతో సహా అన్నీ చెల్లించి తీరుతామని లోకేష్ హెచ్చరించడం విశేషం.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…