తెలుగుదేశం యువ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నెమ్మదిగా దూకుడు పెంచుతున్నారు. ఒక వైకాపా నేత హత్య కేసులో చిక్కుకుని.. ఇటీవలే బెయిల్ మీద బయటికి వచ్చిన తెదేపా నేత కొల్లు రవీంద్రను బుధవారం లోకేష్ పరామర్శించారు. ఆయన వెంట దేవినేని ఉమా సహా పలువురు తెదేపా అగ్ర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా అధికార పార్టీ నేతల్నుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు నారా లోకేష్. వైకాపా నాయకుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్న లోకేష్.. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, జగన్ రెడ్డి గారి అసమర్ధ పాలనని ఎండగడుతున్నారనే అక్కసుతోనే కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపిస్తామని.. అప్పుడు 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల మీద పెట్టిన తప్పుడు కేసులను మరిచిపోయేది లేదని.. అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని.. అడ్డదారులు తొక్కుతున్న వైకాపా నాయకులకు వడ్డీతో సహా అన్నీ చెల్లించి తీరుతామని లోకేష్ హెచ్చరించడం విశేషం.
This post was last modified on September 9, 2020 10:04 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…