Political News

పవన్ కీలక సమావేశం

ఉభయగోదావరి జిల్లాలోని నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రాజమండ్రికి చేరుకున్న పవన్ తన అజెండా ప్రకారమే మంగళవారం సమావేశాలు నిర్వహించబోతున్నారు. రెండురోజుల క్రితమే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నేతలతో విశాఖపట్నంలో సమావేశమైన విషయం తెలిసిందే. అదేపద్దతిలో ఇపుడు ఉభయగోదావరి జిల్లాల్లోని నేతలందరినీ రాజమండ్రికి చేరుకోవాలని కబురుచేయటంతో అందరు చేరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులో జనసేన ఎన్ని సీట్లకు పోటీచేయబోతోంది, పోటీచేయబోయే నియోజకర్గాలు ఏవన్న విషయాలనే నేతలతో పవన్ డీటైల్డ్ గా చర్చించబోతున్నారు.

ఒకరకంగా ఎన్నికల సన్నాహక సమావేశాలనే చెప్పాలి. అలాగే పనిలోపనిగా తమ నేతలను పవన్ మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు. ఎందుకంటే నేతలు, కాపు సామాజికవర్గంలోని ముఖ్యుల ఆలోచనలు చాలా హైరేంజిలో ఉన్నాయి. తక్కువలో తక్కువ 60 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లుంది. రెండుపార్టీల నేతల సమాచారం ప్రకారం 25 అసెంబ్లీలకు మించి జనసేనకు చంద్రబాబునాయుడు ఇచ్చే అవకాశాలు లేవట.

ఇక్కడే డిమాండ్లకు, వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో అర్ధమైపోతోంది. ఈ విషయం మీదే పవన్ నేతలకు స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో పార్టీ పోటీచేయబోయే సీట్లు విషయంలో పవన్ ఇదే పద్దతిలో మాట్లాడారు. త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. పోటీచేసే అవకాశాలు కోల్పోయినా నేతలు బాధపడద్దని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే ఇంతకు మించిన పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఇపుడు రాజమండ్రి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని పవన్ చెప్పే అవకాశముంది.

కాకపోతే ఉత్తరాంధ్రకు ఉభయగోదావరి జిల్లాలకు మధ్య తేడా ఉంది. అదేమిటంటే జనసేన పోటీచేస్తుందని ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో అత్యధికం ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. జనసేన పోటీచేస్తుందని అనుకుంటున్న 25 నియోజకవర్గాల్లో 12 స్ధానాలు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయని పార్టీవర్గాల సమాచారం. ఇలాంటి జిల్లాల్లోనే నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పవన్ చెబితే మరి ఇతర జిల్లాల్లో జనసేనకు ఎన్నిసీట్లు ఇస్తారనే చర్చ పెరిగిపోతోంది. మరీ ప్రశ్నలకు పవన్ ఏమి సమాధానం చెబుతారు, నేతలను ఎలా ఊరడిస్తారో చూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

18 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

24 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

38 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago