Political News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సెంట్ర‌ల్ సెక్యూరిటీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక భ‌ద్ర‌త క‌ల్పించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. రాష్ట్ర పోలీసులు లేదా.. సొంత బౌన్స‌ర్లు మాత్ర‌మే ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అయితే.. గ‌త ఏడాది విశాఖ‌, విజ‌య‌వాడ‌లో పర్య‌టించిన‌ప్పుడు ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యంలోనూ తాత్సారం చేసింది. చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించాలని భావించిన ప‌వ‌న్ వ‌స్తున్న స‌మ‌యంలో అడ్డుకున్నారు.

దీంతో ప‌వ‌న్ రోడ్డుపై భైటాయించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌కుండా.. పోలీసులు చోద్యం చూశారు. ఇది అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇక‌, రాజ‌మండ్రిలోనూ ప‌వ‌న్‌కు పోలీసులు భ‌ద్ర‌త‌ కల్పించ‌లేదు. ఈ వ్య‌వ‌హారం కూడా రాజకీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో అప్ప‌టి నుంచి ప‌వ‌న్ త‌న భ‌ధ్ర‌త‌ను తానే చూసుకుంటున్నారు. బౌన్స‌ర్ల‌ను తెచ్చుకుంటున్నారు. అయితే.. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత‌.. ప‌రిస్థితిలో మార్పు క‌నిపించింది. ప‌వ‌న్‌కు భ‌ద్ర‌గా కేంద్ర బ‌ల‌గాల‌ను నియ‌మించారు.

1+1 భ‌ద్ర‌త‌తో కేంద్ర సీఆర్ పీఎఫ్ భ‌ద్ర‌త‌ను క‌ల్పించిన‌ట్టు అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై ప‌వ‌న్ కానీ, జ‌న‌సేన కానీ.. స్పందించ‌లేదు. తాజాగా విశాఖ‌ప‌ట్నం వ‌చ్చిన ప‌వ‌న్ వెంట ఇద్ద‌రు సీఆర్ పీఎఫ్ సిబ్బంది భ‌ద్ర‌త‌గా ఉన్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా వారు వెంటే ఉన్నారు. ఇక‌, రాష్ట్ర పోలీసులు కూడా ప‌వ‌న్‌కు భ‌ద్ర‌త పెంచారు. మ‌రి కేంద్ర‌మే చెప్పిందో.. రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన నేప‌థ్యంలో తీసుకున్న నిర్ణ‌య‌మో తెలియ‌దు కానీ.. సీఐ స్థాయి పోలీసులు.. ప‌వ‌న్‌కు భ‌ద్ర‌త‌గా నిలిచారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు సీఆర్ పీఎఫ్ భ‌ద్ర‌త వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది.

This post was last modified on February 20, 2024 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago