Political News

బాల‌య్య వార్నింగ్.. జ‌గ‌న్ రియాక్ష‌న్‌

ఏపీ వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఫైర్ అయ్యారు. అదేస‌మ‌యంలో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. “ఇదేం ప‌ద్ద‌తి. మీరు ఎలానూ ఓడిపోతారు. ఇంకా దాడులు చేయ‌డం ఎందుకు? ఇప్ప‌టికైనా మానుకోండి. లేక పోతే తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది” అని బాల‌య్య వార్నింగ్ ఇచ్చారు. మ‌రి దీని ప్ర‌భావ‌మో ఏమో.. తెలియ‌దు కానీ.. సీఎం జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. నిత్యం తాను తిట్టిపోసే ఓ పత్రిక ఫొటో జ‌ర్న‌లిస్టుపై జ‌రిగిన దాడిని సీరియ‌స్‌గా తీసుకుని.. వెంట‌నే నిందితుల‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. దీంతో ఈ ప‌రిణామం ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగింది?

ఆదివారం సాయంత్రం అనంత‌పురం జిల్లా రాప్తాడులో వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్వ‌హించిన సిద్ధం-3వ స‌భ‌లో ఓ దిన‌ప‌త్రిక‌కు చెందిన ఫొటో జ‌ర్న‌లిస్టుపై దాడి జ‌రిగింది. ఈ దాడిలో స‌ద‌రు ఫొటో జ‌ర్న‌లిస్టు తీవ్రంగా గాయ‌ప‌డి.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయ‌నకు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. అదేస‌మయంలో వైసీపీ ప్ర‌భుత్వంపైనా, నాయ‌కుల‌పైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సోమ‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు కూడా జ‌ర్న‌లిస్టుకు సంఘీభావం తెలుపుతూ.. అనేక మంది ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు. అయితే.. ప్ర‌భుత్వం వైపు నుంచి పెద్ద‌గా స్పందన రాలేదు.

బాల‌య్య వార్నింగ్‌..

జ‌ర్న‌లిస్టుపై జ‌రిగిన‌ ఘ‌ట‌న‌పై బాల‌య్య స్పందించారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. విధుల్లో ఉన్న జ‌ర్న‌లిస్టుల‌పై వైసీపీ నాయ‌కులు.. దాడి చేయ‌డం హేయ‌మైన చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు. “రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు పెరుగుతున్నాయి. జర్నలిస్టులకు రక్షణ కరువైంది. జర్నలిస్టుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించే గొంతు నొక్కాలనుకోవడం హర్షించదగిన విషయం కాదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు మరెంతో దూరం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం” అని బాల‌య్య వార్నింగ్ ఇచ్చారు.

జ‌గ‌న్ రెస్పాండ్‌..

బాల‌య్య సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చిన త‌ర్వాత సీన్ మారిపోయింది. వెను వెంట‌నే సీఎం జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్‌తో ఫోన్‌లో మాట్లాడారు. “ఇలాంటి ఘ‌ట‌న జ‌రుగుతుంద‌ని మీకు ముందే తెలుసా? తెలిసినా.. చేతులు ముడుచుకుని కూర్చున్నారా?” అని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అదేవిధంగా ఈ ఘ‌ట‌న‌లో బాధ్యులు ఎలాంటి వారైనా..చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఈ ఆదేశాలు అందిన వెంట‌నే ఎస్పీ మీడియా ముందుకు వ‌చ్చారు. ఘ‌ట‌న‌లో బాధ్యులైన వారిని గుర్తించిన‌ట్టు చెప్పారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అద‌న‌పు ఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించిన‌ట్టు చెప్పారు. ఈ విష‌యంపై సీఎం జ‌గ‌న్ కూడా సీరియ‌స్‌గా ఉన్నార‌ని. తెలిపారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న‌తో అంటే.. బాల‌య్య వార్నింగ్‌.. జ‌గ‌న్ రియాక్ష‌న్‌తో బాధిత జ‌ర్న‌లిస్టుకు న్యాయం జ‌ర‌గ‌డం.. ఆస‌క్తిగా మారింది.

This post was last modified on February 19, 2024 10:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

56 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

3 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

3 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

12 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

12 hours ago