Political News

టీడీపీ-జ‌న‌సేన ఒకే పాట‌.. కార్య‌క‌ర్త‌ల గురించే!

టీడీపీ-జ‌న‌సేన పార్టీలు పొత్తు పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల్లోనూ క‌ల‌వ‌ర ప‌రుస్తున్న ఏకైక విష‌యం.. క్షేత్ర‌స్థాయిలో ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీని ముందుకు న‌డిపించిన నాయ‌కులు.. టికెట్లు కోరుతుండ‌డం.. ఆమేర‌కు పార్టీల‌కు టికెట్లు ద‌క్కే ఛాన్స్ లేక‌పోవ‌డం. దీంతో రెండు పార్టీలు కూడా.. కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గించే ప‌నిచేప‌ట్టాయి. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ఇద్ద‌రూ కూడా కార్య‌క‌ర్త‌లు మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేయాల‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తామ‌ని చెబుతున్నా రు.

అంతేకాదు.. టికెట్లు రాలేద‌ని.. గుస్సాగా ఉండొద్ద‌ని, వ్య‌తిరేక ప్ర‌చారం చేయొద్ద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఇక‌, నారా లోకేష్ మ‌రో అడుగు ముందుకు వేసి.. తాను అంతా గ‌మ‌నిస్తున్నాన‌న్నారు. పార్టీలో ఎవ‌రు క‌ష్ట‌ప‌డుతున్నారో త‌న‌కు తెలుసున‌ని.. ఆ మేర‌కు వారికి న్యాయం జ‌రుగుతుంద‌ని కూడా చెప్పారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జగించే ప‌నిని ప్రారంభించారు. ప్ర‌స్తుతం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. పార్టీ కార్య‌క‌ర్ల‌తో భేటీ అయ్యారు. టికెట్ల కోసం.. చాలా మంది మీలో ఎదురు చూస్తున్నారు. ఆ విష‌యం నాకు తెలుసు. కానీ.. కొన్ని కొన్ని సంద‌ర్భాలు సంక్లిష్టంగా ఉంటాయి. మీరు అర్ధం చేసుకోవాలి అని వ్యాఖ్యానించారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తాను తీసుకుంటాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, టికెట్లు కూడా వారికిఇచ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు వచ్చే టిక్కెట్ల కన్నా.. భవిష్యత్తులో మరిన్ని పదవులు రాబోతున్నాయని చెప్పారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు టీడీపీలో రెండు సార్లు కీలక పదవి వచ్చేలా చేశానని.. అలాంటిది పార్టీ కోసం కష్టపడే వారిని వదిలేయబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్ర‌తి ఒక్క‌రూ మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ సూచించారు. ప‌ని చేసిన వారి పేర్లు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌డుపులో పెట్టుకుని కాపాడుకుంటామ‌ని.. అన్నారు. క్షేత్ర‌స్థాయిలో మీరు కూడా ప‌ద‌వులు కోరుకుంటారు. ఇది త‌ప్పేంకాదు. కానీ, రాష్ట్రంలో కొన్ని రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి. అందుకే మ‌నం ప్ర‌స్తుతానికి ప‌ద‌వుల‌పై కాకుండా.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేలా వైసీపీని గ‌ద్దె దింపేలా ప‌నిచేయాలి. త‌ర్వాత‌.. ప‌ద‌వులు వాతంట‌త అవే వ‌స్తాయి. మీరు ఆ విషయాన్ని నాకు వ‌దిలేయండి అని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 19, 2024 10:00 pm

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

33 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago