వైసీపీ రాజకీయ వ్యూహకర్తల బృందం `ఐప్యాక్`తో సీఎం జగన్ తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ పరిణామం వైసీపీలో నేతల మధ్య అలజడికి దారితీసింది. ఇప్పటికే చాలా మంది నాయకులను ఐప్యాక్ సర్వేల ఆధారంగా పక్కన పెట్టడం.. బదిలీ చేయడం చేసిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని.. నాయకులు హడలి పోతున్నారు. తాజాగా ఐప్యాక్ బృందంతో భేటీ అయిన సీఎం జగన్.. వచ్చే ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికి సుమారు 70 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక, మిగిలినస్థానాల్లో పరిస్థితి ఎలా ఉందనేది వారితో చర్చించారని తెలిసింది. అదేవిధంగా వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని కూడా ఆరాతీసినట్టు తెలిసింది. ఇటీవల ఐప్యాక్ బృందం ఈ నాలుగు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వైసీపీకి ఉన్న పాజిటివిటీ.. అదేసమయంలో ప్రతిపక్షాలకు ఉన్న పాజిటివిటీలను కూడా ఈ బృందం నివేదిక రూపంలో రెడీ చేసింది. దీనిని సీఎం జగన్కు అందించినట్టు తెలిసింది.
ఈ క్రమంలో ప్రాంతాలు, నియోజకవర్గాలు, పార్లమెంటు స్ధానాల వారీగా పార్టీ పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. వైసీపీకి ఏయే జిల్లాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ప్రతిపక్షాలకు ఏయే జిల్లాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకోడానికి మ్యానిఫెస్టోలో ఏయే కార్యక్రమాలు చేర్చాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే మ్యానిఫెస్టోపై పార్టీ సీనియర్లతో జగన్ కసరత్తు చేశారు. ముఖ్యంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్లు దీనిని చూస్తున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఐప్యాక్ బృందంతోనూ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ చర్చించారు. గతంలో ఇచ్చిన దానికి భిన్నమైన పథకాలుఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. సీఎం జగన్ ఐప్యాక్ బృందంతో చర్చలు జరుపుతున్న వ్యవహారం పార్టీలో చర్చనీయాంశం అయింది. ఈ బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందో.. తమలో ఎంతమందిని పక్కన పెడతారో.. అనే విషయంపై నాయకులు తల్లడిల్లుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on February 19, 2024 9:58 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…