వైసీపీ రాజకీయ వ్యూహకర్తల బృందం `ఐప్యాక్`తో సీఎం జగన్ తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ పరిణామం వైసీపీలో నేతల మధ్య అలజడికి దారితీసింది. ఇప్పటికే చాలా మంది నాయకులను ఐప్యాక్ సర్వేల ఆధారంగా పక్కన పెట్టడం.. బదిలీ చేయడం చేసిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని.. నాయకులు హడలి పోతున్నారు. తాజాగా ఐప్యాక్ బృందంతో భేటీ అయిన సీఎం జగన్.. వచ్చే ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికి సుమారు 70 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక, మిగిలినస్థానాల్లో పరిస్థితి ఎలా ఉందనేది వారితో చర్చించారని తెలిసింది. అదేవిధంగా వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని కూడా ఆరాతీసినట్టు తెలిసింది. ఇటీవల ఐప్యాక్ బృందం ఈ నాలుగు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వైసీపీకి ఉన్న పాజిటివిటీ.. అదేసమయంలో ప్రతిపక్షాలకు ఉన్న పాజిటివిటీలను కూడా ఈ బృందం నివేదిక రూపంలో రెడీ చేసింది. దీనిని సీఎం జగన్కు అందించినట్టు తెలిసింది.
ఈ క్రమంలో ప్రాంతాలు, నియోజకవర్గాలు, పార్లమెంటు స్ధానాల వారీగా పార్టీ పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. వైసీపీకి ఏయే జిల్లాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ప్రతిపక్షాలకు ఏయే జిల్లాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకోడానికి మ్యానిఫెస్టోలో ఏయే కార్యక్రమాలు చేర్చాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే మ్యానిఫెస్టోపై పార్టీ సీనియర్లతో జగన్ కసరత్తు చేశారు. ముఖ్యంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్లు దీనిని చూస్తున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఐప్యాక్ బృందంతోనూ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ చర్చించారు. గతంలో ఇచ్చిన దానికి భిన్నమైన పథకాలుఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. సీఎం జగన్ ఐప్యాక్ బృందంతో చర్చలు జరుపుతున్న వ్యవహారం పార్టీలో చర్చనీయాంశం అయింది. ఈ బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందో.. తమలో ఎంతమందిని పక్కన పెడతారో.. అనే విషయంపై నాయకులు తల్లడిల్లుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on February 19, 2024 9:58 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…