వైసీపీ అధినేత, సీఎం జగన్కు జనసేన ప్రధాన కార్యదర్శి ఫైర్ బ్రాండ్ నాగబాబు భారీ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం అనంతపురంజిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే నాగబాబు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరోసారి ప్రారంభమైంది.
ఏం జరిగింది..?
రాప్తాడు సిద్ధం జభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఫ్యాన్ ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడూ బటయే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లోనే జనం చొక్కాలు మడతపెట్టి, చంద్రబాబు కుర్చీలు 23కి మడతపెట్టారంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ జనం మరోసారి చంద్రబాబు కుర్చీలు మడతపెట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
నాగబాబు కౌంటర్ ఇదీ..
సీఎం జగన్ రాప్తాడులో చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘గ్లాస్’ సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుందని తెలిపారు. కానీ ‘ఫ్యాన్’ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదన్నారు. అయినా సారూ.. మీరు పబ్లిక్ మీటింగ్స్లో ప్రాసలు, పంచులు మీద పెట్టిన శ్రద్ధలో సగం ‘ప్రజా పరిపాలన’ మీద పెట్టుంటే బాగుండేదని నాగబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. మరిదీనిప వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 19, 2024 2:23 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…