తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు గెలవని నియోజకవర్గాలు 42 ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. పొత్తుల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించటేయటం, ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్ధిని పోటీకి దింపటం లాంటి అనేక కారణాల వల్ల టీడీపీ జెండా ఎగరలేదనే చెప్పాలి. ఇలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల కూడా ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో నాలుగు ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డే గెలుస్తున్నారు. ఇందులో రెండుసార్లు కాంగ్రెస్ నుండి చివరి రెండు ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచారు.
తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఐదోసారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో చివరి ఐదు ఎన్నికల్లో మాచెర్లలో టీడీపీ తరపున ఐదుగురు అభ్యర్ధులు పోటీచేశారు. 2004లో జూలకంటి బ్రహానందరెడ్డి, 2009లో జూలకంటి బ్రహ్మారెడ్డి, 2012 ఉపఎన్నికలో చిరుమామిళ్ళ మధుబాబు, 2014లో కొమ్మారెడ్డి చలమారెడ్డి, 2019లో అన్నపురెడ్డి అంజిరెడ్డి పోటీచేశారు. చంద్రబాబులో పెద్ద మైనస్ ఏమిటంటే ఒక ఎన్నికలో ఓడిపోగానే తర్వాత ఎన్నికకు అభ్యర్ధిని మార్చేస్తారు. చంద్రబాబు అలవాటే చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సమస్యగా తయారైంది.
టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన జూలకంటి బ్రహ్మారెడ్డినే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పోటీచేయించబోతున్నారు. పిన్నెల్లిని ధీటుగా ఎదుర్కోగలిగిన నేత బ్రహ్మారెడ్డి మాత్రమే అని చంద్రబాబు గుర్తించారు. నియోజకవర్గానికి ఇన్చార్జి అయినప్పటినుండి బ్రహ్మారెడ్డి కూడా చాలా యాక్టివగ్ నే పనిచేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా అధికారపార్టీని ఢీకొట్టే రీతిలో రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్లో బ్రహ్మారెడ్డిపైన నమ్మకం కుదిరినట్లుంది. అందుకనే చాలామంది ఇన్చార్జికి మద్దతుగా నిలబడుతున్నారు.
రెండుపార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులతో నియోజకర్గంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్ధితి కనబడుతోంది. పిన్నెల్లికి పార్టీతో పాటు నియోజకవర్గంలో కూడా అపరామైన పట్టుంది. వరుసగా నాలుగుసార్లు గెలుస్తున్న కారణంగా వ్యతిరేకత కూడా ఎంతో కొంత ఉంటుందనటంలో సందేహంలేదు. జనసేన మద్దతుతో బ్రహ్మారెడ్డి, అధికార అండదండలతో పిన్నెల్లి రాబోయే ఎన్నికలను ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నారు. ఇద్దరిలో ఏ విషయంలోను ఎవరు తక్కువ కాదు కాబట్టి గెలుపు ఎవరిదో చూడాలి. బ్రహ్మారెడ్డి గెలిస్తే మాచెర్లలో టీడీపీ చరిత్రను తిరగరాసినట్లే అవుతుంది.
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…