Political News

నో చేరికలు..పెరిగిపోతున్న టెన్షన్

ఫిబ్రవరి నెలను తెలంగాణా బీజేపీ నేతలు జాయినింగ్ మంత్ అని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలు వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారంటూ మొన్నటి జనవరిలో ఊదరగొట్టేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి చాలామంది బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి చాలామంది చెప్పుకున్నారు. తీరా చూస్తే జాయినింగ్ మంత్ మొదలై 18 రోజులు అయిపోయింది కాని గట్టి నేతలు వచ్చింది లేదు, చేరిందీ లేదు. దీంతో బీజేపీ సీనియర్లలో టెన్షన్ పెరిగిపోతోంది. అగ్రనేతలు అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలీటంలేదట.

ఏదో తూతుమంత్రంగా అక్కడక్కడ ఎంపీపీలు, జడ్పీటీసీలు మాత్రమే జాయిన్ అయ్యారు. ఇలాంటి వాళ్ళవల్ల చెప్పుకోదగినంత ప్రభావం కనపించదని అందరికీ తెలిసిందే. బండి సంజయ్ అయితే బీఆర్ఎస్ నుండి ఐదుగురు ఎంపీలు వచ్చేస్తున్నారని చాలా రోజుల నుండి చెబుతునే ఉన్నారు. పదిమంది ఎంఎల్ఏలు కూడా తమతో టచ్ లో ఉన్నారని నానా రచ్చ చేస్తున్నారు. అయితే వీళ్ళ మాటలను పార్టీలోని నేతలే చాలామంది నమ్మటం లేదు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తుంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

నిజంగానే పై రెండు పార్టీల మధ్య పొత్తుంటే గనుక బీఆర్ఎస్ కు చెందిన ఏ స్ధాయి నేత కూడా బీజేపీలో చేరడానికి ఇష్టపడరు. ఎందుకంటే రెండు పార్టీలు ఒకటే అయినప్పుడు ఇక బీఆర్ఎస్ లోనే కంటిన్యు అయితే ఏమిటి ? బీజేపీలో చేరితే ఏమిటి ? రెండు పార్టీల్లో దేనిలో ఉన్నా ఎవరికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఒకవేళ పొత్తున్నది కేవలం కల్పితమే అయితే అప్పుడు కూడా బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి రావడానికి పెద్దగా ఇష్టపడరు.

ఎందుకంటే జాతీయస్థాయిలో బీజేపీ బలంగా ఉండచ్చు కాని తెలంగాణలో మాత్రం ఒక మోస్తరు పార్టీనే కాని ఏమంత బలమైన నేతలు, క్యాడర్ ఉన్న పార్టీ అయితే కాదు. మిగిలిన పార్టీల్లో ఉన్నట్లే కమలంపార్టీలో కూడా విపరీతమైన గ్రూపు రాజకీయాలున్నాయి. బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ లో నుండి బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళ పరిస్ధితి ఎలాగుందో అందరు చూస్తున్నదే. కాబట్టి జాయినింగ్ మత్ అయిన ఫిబ్రవరిలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ నేత ఇతర పార్టీల్లో నుండి ఎవరూ రాలేదన్నది వాస్తవం.

This post was last modified on February 19, 2024 11:12 am

Share
Show comments
Published by
satya

Recent Posts

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…

4 hours ago

జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

5 hours ago

ఏపీలో బెట్టింగ్ మార్కెట్ ఏం చెబుతోంది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…

5 hours ago

ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటరు !

నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…

6 hours ago

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

7 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

8 hours ago