Political News

1 మిలియ‌న్ ల‌క్ష్యం ఛేదించిన వైసీపీ!

ఏపీ అధికార పార్టీ వైసీపీ పెట్టుకున్న కీల‌క ల‌క్ష్యం నెర‌వేరింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మంటూ.. రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ సిద్ధం పేరిట ఎన్నిక‌ల స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి విశాఖ‌, ఏలూరుల్లో సిద్ధం స‌భ‌లు నిర్వ‌హించిన వైసీపీ అధినేత‌.. తాజాగా అనంత‌పురంలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో మూడో సిద్ధం స‌భ ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ఈ స‌భ‌కు భారీ లక్ష్యాన్నే నిర్దేశించారు. ఏకంగా మూడో ద‌ఫా సిద్ధం స‌భ‌కు 1 మిలియ‌న్‌.. అంటే ప‌ది ల‌క్ష‌ల పైచిలుకు.. జ‌నాభాను తీసుకురావాల‌ని పార్టీ నేత‌ల‌కు ల‌క్ష్యాన్ని నిర్దేశించారు.

దీంతో రాప్తాడు స‌భ‌లో ఈ ల‌క్ష్యం నెర‌వేరిందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎటు చూసినా.. వైసీపీ జెండాలే మెరిశాయి. ఎటు చూసినా.. ప్ర‌జ‌లు జ‌య జ‌య ధ్వానాలే మిన్నంటాయి. ఏదారి చూసినా వైసీపీ స‌భ‌కే దారి తీస్తోందా.. అన్న‌ట్టుగా.. పెద్ద పిన్నా.. అంద‌రూ వైసీపీ సిద్ధం స‌భ వైపే అడుగులు వేశారు. వైసీపీ పార్టీ ప‌రంగా కొంత మేర‌కు బ‌స్సులు పెట్టినా.. అవి కూడా .. స‌రిపోక‌.. చాలా మంది స్వ‌చ్ఛందంగా స‌భ‌కు త‌ర‌లివ‌చ్చారు. మ‌రికొంద‌రు.. కాలిబాట‌న వ‌చ్చి చేరుకున్నారు. మొత్తంగా.. పార్టీ వ్యూహం.. అంచ‌నా.. ల‌క్ష్యం.. ఇలా ఒకదానితో ఒక‌టి క‌లిసి వ‌చ్చి.. ఫ‌లించాయి.

ఫ‌లితంగా.. వైసీపీ అదినేత పెట్టుకున్న 10 లక్ష‌ల మంది ల‌క్ష్యాన్ని పార్టీ ఛేదించింది. తాజా లెక్క‌ల ప్ర‌కారం.. సుమారు 10 నుంచి 12ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఈ సిద్ధం మూడో స‌భ‌కు హాజ‌ర‌య్యార‌ని అంటున్నారు., కొంద‌రు.. స‌భా ప్రాంగంలో సీట్లు ల‌భించ‌క‌.. రోడ్ల‌పైనే నిల‌బ‌డి.. సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని విన్నారు. మ‌రికొంద‌రు.. స‌భ‌లో నిల‌బ‌డి.. ఇంకొంద‌రు.. త‌మ త‌మ వాహ‌నాల్లోనే కూర్చుని సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని తిలకించారు. చాలా మంది .. స‌భా ప్రాంగణం కిక్కిరిసిపోయినా.. ఓపిక‌గా నిల‌బ‌డి సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని ఆసాంతం ఆల‌కించారు. దీంతో వైసీపీ నాయ‌కుల ఉత్సాహానికి అంతులేకుండా పోయింది.

గ‌త రెండు సిద్ధం స‌భ‌ల‌కు.. మించి..అన్న‌ట్టుగా రాప్తాడు స‌భను క్షేత్ర‌స్థాయిలో పార్టీ నాయ‌కులు బ్ర‌హ్మాండంగా విజ‌యవంతం చేశార‌ని పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. ఇక‌, గ‌తంలో తొలి సిద్ధం స‌భ‌కు 5 ల‌క్ష‌ల మందిని టార్గెట్‌గా పెట్టుకోగా.. 6 నుంచి 7 ల‌క్ష‌ల మంది వ‌చ్చార‌ని అంచ‌నా ఉంది. ఇక‌, ఏలూరు జిల్లాలో నిర్వ‌హించిన రెండో సిద్ధం స‌భ‌కు కూడా.. ఇంచుమించు ఇంత‌క‌న్నా ఎక్కువ‌మందే హాజ‌ర‌య్యారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా 10 ల‌క్ష‌ల మంది పైగానే ప్ర‌జ‌లు హాజ‌రైన‌ట్టు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు సీఎం జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌, ఆయ‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థంగా వారు పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 18, 2024 10:54 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

22 minutes ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

27 minutes ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

31 minutes ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

2 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

2 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

4 hours ago