చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది నాగబాబు వ్యవహారం. డ్యామేజి జరిగిపోయిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కంట్రోల్ కు దిగారు. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో పర్యటిస్తున్న నాగబాబు సమీక్షలు కూడా చేస్తున్నారు. అయితే సీనియర్ నేత, మొదటినుండి పార్టీ జెండాను మోస్తున్న శివశంకర్ ను మాత్రం పట్టించుకోలేదు.
రాబోయే ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేయాలని శివశంకర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ నుండి వచ్చిన పంచకర్ల రమేష్ కు టికెట్ ను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారట. అందుకనే శివశంకర్ ను పార్టీ నాయకత్వం పట్టించుకోవటంలేదు. మరి దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలాగ ఉంటుందో చూడాలి. ఇదే పద్దతిలో అనకాపల్లికి చెందిన కొణతాల రామకృష్ణను కూడా ఎవరు పట్టించుకోవటంలేదు. ఈమధ్యనే పవన్ పిలుపు మేరకు కొణతాల పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు టికెట్ హామీతోనే కొణతాల జనసేనలో చేరారనే ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీలో చేరేంతవరకు కొణతాలపై బాగా ఇంట్రస్టుచూపించిన నాయకత్వం ఇపుడు పట్టించుకోవటంలేదు. కొద్దిరోజులుగా అనకాపల్లిలోనే క్యాంపు వేసిన నాగబాబు మాజీ ఎంపీ కొణతాలను కనీసం కలవను కూడా కలవలేదు. సమావేశాలకు, సమీక్షలకు కూడా పిలవలేదు. దాంతో నాగబాబు వ్యవహారంపై పార్టీలో బాగా అసంతృప్తి పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం పార్టీ గెలుపుపై పడుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే సడెన్ గా కొణాతల ఇంటికి నాగబాబు వెళ్ళారు.
ఇంతకీ కొణతాలను జనసేన ఎందుకు పట్టించుకోవటంలేదు ? ఎందుకంటే అనకాపల్లి ఎంపీగా నాగబాబే పోటీచేయబోతున్నారనే ప్రచారం తెలిసిందే. ఒకవైపు నాగబాబే పోటీచేస్తున్నారని అనుకుంటున్నపుడు ఇక ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న కొణతాలను ఎవరు పట్టించుకుంటారు ? మరిదే నిజమైతే అసలు కొణతాలను పార్టీలో పవన్ ఎందుకు చేర్చుకున్నట్లు ? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఏదేమైనా శివశంకర్, కొణతాల విషయంలో పార్టీకి జరిగిన డ్యామేజి కంట్రోల్ అవుతుందా ? అన్నదే అసలైన పాయింట్.
నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు.
This post was last modified on February 18, 2024 2:50 pm
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…
మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…
స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్ ఇస్తున్న…
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…