తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నదానికన్నా చక్కగానే ఉపయోగించుకున్నది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగతంగా కేసీయార్, హరీష్ రావును ఇరుకునపెట్టడమే టార్గెట్ గా రేవంత్ అండ్ కో పావులు కదిపింది. ఇందుకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలను అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని అనుకున్నది. అనుకున్నట్లే సమావేశాల్లో కేసీయార్, హరీష్ పైన పదేపదే ఆరోపణలు చేసింది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణం వల్ల ఎందుకు పనికిరాకుండా పోతోందనే విషయాన్ని జనాల్లోకి రేవంత్, మంత్రలు చాలా బలంగా పంపించగలిగారు. హోల్ మొత్తంమీద కేసీయార్, హరీష్ భారీ అవినీతికి పాల్పడ్డారనే అంశాన్ని జనాల్లోకి పంపించగలిగారు.
వేలకోట్ల రూపాయలు కేసీయార్ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని దోచుకున్నట్లు రేవంత్, మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కేసీయార్ అండ్ కో సరిగా తిప్పికొట్టలేకపోయారు. పైగా వాళ్ళు చేసిన అడ్డుగోలు వాదనలతో భారీ అవినీతి జరిగింది నిజమే అని జనాలు అనుకోవడం మొదలుపెట్టారు. తాము ఏ తప్పుచేయలేదని భయపడాల్సిన అవసరం లేదని మాత్రమే హరీష్ రావు అసెంబ్లీలో పదేపదే చెప్పారు. మరిదే నిజమైతే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా జరిగిందన్న కాగ్ రిపోర్టును ఏమంటారు ? అన్నది రేవంత్ ప్రశ్న.
అలాగే రాజకీయ లబ్దికోసమే మేడిగడ్డ బ్యారేజిని పునరుద్ధరించలేదని హరీష్ ఎదురుదాడి తనను తాను రక్షించుకోవటం కోసమే అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మేడిగడ్డను రేవంత్ ప్రభుత్వం పునరుద్ధరించలేదని స్వయంగా హరీషే అన్నారు. అంటే తమ హయాంలో మేడిగడ్డ బ్యారేజి దెబ్బతిన్నదని అంగీకరించటమే కదా. కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు మరికొన్ని నిర్మాణమైంది కేసీయార్ పాలనలోని పదేళ్ళల్లోనే కదా. అంటే అందులో బయటపడుతున్న అవినీతి, అక్రమాలకు బాధ్యత వహించాల్సింది కూడా కేసీయార్, హరీషే అని రేవంత్, మంత్రులు ధాటిగా చెబుతున్నారు.
అందుకనే కాళేశ్వరం కళంకమంతా మామా, అల్లుళ్ళదే అని కేసీయార్, హరీష్ ను ఉద్దేశించి అసెంబ్లీలో రేవంత్ చెప్పింది. ఇంకా విచిత్రం ఏమిటంటే నల్గొండ సభలో కేసీయార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజిలో ఒక పిల్లర్ కుంగితే ఏమవుతుంది ? అని ప్రశ్నించటం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఒక్క పిల్లరైనా ఎందుకు కుంగాలి అన్న ప్రశ్న జనాల్లో మొదలైంది. నిజానికి కుంగింది ఒక్క పిల్లర్ కాదు నాలుగు పిల్లర్లు. వర్షాలు, వరదలు లేనపుడే నాలుగు పిల్లర్లు కుంగితే భారీ వర్షాలు, వరదలు వస్తే బ్యారేజి కొట్టుకుపోకుండా ఉంటుందా అనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. మరి దీనికి కేసీయార్ ఏమి సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on February 18, 2024 2:43 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…