Political News

రేవంత్ ప్రభుత్వం  టార్గెట్ రీచయ్యిందా ?

తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నదానికన్నా చక్కగానే ఉపయోగించుకున్నది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగతంగా కేసీయార్, హరీష్ రావును ఇరుకునపెట్టడమే టార్గెట్ గా రేవంత్ అండ్ కో పావులు కదిపింది. ఇందుకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలను అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని అనుకున్నది. అనుకున్నట్లే సమావేశాల్లో కేసీయార్, హరీష్ పైన పదేపదే ఆరోపణలు చేసింది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణం వల్ల ఎందుకు పనికిరాకుండా పోతోందనే విషయాన్ని జనాల్లోకి రేవంత్, మంత్రలు చాలా బలంగా పంపించగలిగారు. హోల్ మొత్తంమీద కేసీయార్, హరీష్ భారీ అవినీతికి పాల్పడ్డారనే అంశాన్ని జనాల్లోకి పంపించగలిగారు.

వేలకోట్ల రూపాయలు కేసీయార్ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని దోచుకున్నట్లు రేవంత్, మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కేసీయార్ అండ్ కో సరిగా తిప్పికొట్టలేకపోయారు. పైగా వాళ్ళు చేసిన అడ్డుగోలు వాదనలతో భారీ అవినీతి జరిగింది నిజమే అని జనాలు అనుకోవడం మొదలుపెట్టారు. తాము ఏ తప్పుచేయలేదని భయపడాల్సిన అవసరం లేదని మాత్రమే హరీష్ రావు అసెంబ్లీలో పదేపదే చెప్పారు. మరిదే నిజమైతే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా జరిగిందన్న కాగ్ రిపోర్టును ఏమంటారు ? అన్నది రేవంత్ ప్రశ్న.

అలాగే రాజకీయ లబ్దికోసమే మేడిగడ్డ బ్యారేజిని పునరుద్ధరించలేదని హరీష్ ఎదురుదాడి తనను తాను రక్షించుకోవటం కోసమే అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మేడిగడ్డను రేవంత్ ప్రభుత్వం పునరుద్ధరించలేదని స్వయంగా హరీషే అన్నారు. అంటే తమ హయాంలో మేడిగడ్డ బ్యారేజి దెబ్బతిన్నదని అంగీకరించటమే కదా. కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు మరికొన్ని నిర్మాణమైంది కేసీయార్ పాలనలోని పదేళ్ళల్లోనే కదా. అంటే అందులో బయటపడుతున్న అవినీతి, అక్రమాలకు బాధ్యత వహించాల్సింది కూడా కేసీయార్, హరీషే అని రేవంత్, మంత్రులు ధాటిగా చెబుతున్నారు.

అందుకనే కాళేశ్వరం కళంకమంతా మామా, అల్లుళ్ళదే అని కేసీయార్, హరీష్ ను ఉద్దేశించి అసెంబ్లీలో రేవంత్ చెప్పింది. ఇంకా విచిత్రం ఏమిటంటే నల్గొండ సభలో కేసీయార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజిలో ఒక పిల్లర్ కుంగితే ఏమవుతుంది ? అని ప్రశ్నించటం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఒక్క పిల్లరైనా  ఎందుకు కుంగాలి అన్న ప్రశ్న జనాల్లో మొదలైంది. నిజానికి కుంగింది ఒక్క పిల్లర్ కాదు నాలుగు పిల్లర్లు. వర్షాలు, వరదలు లేనపుడే నాలుగు పిల్లర్లు కుంగితే భారీ వర్షాలు, వరదలు వస్తే బ్యారేజి కొట్టుకుపోకుండా ఉంటుందా అనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. మరి దీనికి కేసీయార్ ఏమి సమాధానం చెబుతారో చూడాలి. 

This post was last modified on February 18, 2024 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

1 hour ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

2 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

3 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

3 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

5 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

5 hours ago