Political News

టీడీపీ జేఎస్పీతో బీజేపీతో జాయింట్ మీటింగ్

ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈ నెలాఖరులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగానే అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తులను ఫైనల్ చేయబోతున్నారట. అందుకనే ఈనెల 20 లేదా 21వ తేదీన బీజేపీ అగ్రనేతలతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అవబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏపీ నుంచి కూడా బీజేపీ నేతలు వెళ్ళారు.

ఈ సందర్భంగానే రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి, పొత్తు పెట్టుకుంటే జరిగే లాభాలు, తీసుకోవాల్సిన సీట్లపై చర్చలు జరిగినట్లు సమాచారం. లోకల్ నేతలతో మాట్లాడటం, విడిగా ఇప్పటికే తెప్పించుకున్న రిపోర్టులను సరిచూసుకున్నారట. అందుకనే చంద్రబాబు, పవన్ తో జాయింట్ మీటింగ్ పెట్టుకుని పొత్తులను ఫైనల్ చేయాలని బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయ్యారట. ముందుగా చంద్రబాబు ఎన్డీయేలో చేరితే ఆ తర్వాత పొత్తుల విషయాన్ని మాట్లాడచ్చని అనుకున్నారట. ఎన్డీయేలో చేరితే టీడీపీ పార్టనర్ అవుతుంది. అప్పుడు పొత్తుల విషయంతో పాటు పోటీ చేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ఫైనల్ చేయటానికి వీలుగా ఉంటుందని భావించారట.

అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారట. కాబట్టే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ తో జాయింట్ గా సమావేశం కాబోతున్నారు. బహుశా 20 లేదా 21వ తేదీన ఢిల్లీలో మీటింగ్ జరిగే అవకావముందని పార్టీవర్గాల సమాచారం. ఈమధ్యనే పొత్తులపై చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన విషయం తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో ఏమి జరిగింది ? ఎవరేమి మాట్లాడారనే విషయంలో క్లారిటీ లేదు.

అయితే రెండు మూడు రోజుల్లో జరగబోయే మీటింగు మాత్రం చాలా కీలకమైనదనే అంటున్నారు. ఎన్డీయేలో జాయిన్ అవటం, పొత్తులపై మాట్లాడుకోవటం, సీట్లసంఖ్య, నియోజకర్గాలను వీలైనంత తొందరగా తేల్చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీ కన్నా జనసేన, టీడీపీ పైనే ఎక్కువ ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అయితే ఎంతస్పీడుగా చర్చల ప్రక్రియ మొదలుపెట్టినా పైన చెప్పిన ప్రక్రియ ముగిసేటప్పటికి మార్చి మొదటి వారం అయిపోతుందని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on February 18, 2024 12:56 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP - BJP

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

26 minutes ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

1 hour ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

2 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

2 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

3 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

3 hours ago