Political News

అడ్డు వ‌స్తే.. తొక్కుకుంటూ పోతా: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అడ్డు వ‌స్తారా? రండి.. తొక్కుకుంటూ పోతా! ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు. ఇక‌నుంచి మ‌రో ఎత్తు. ఏమ‌నుకుంటున్నారో.. ఖ‌బ‌డ్దార్‌! అని హెచ్చ‌రించారు. కొన్నాళ్లుగా విరామం ప్ర‌క‌టించిన‌.. రా.. క‌ద‌లిరా! స‌భ‌ల‌ను తిరిగి ప్రారంభించిన చంద్ర‌బాబు.. బాప‌ట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎందుకంత కోపం?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంత కోప‌గించుకోవ‌డానికి, నిప్పులు చెర‌గడానికి కార‌ణం.. రా..క‌ద‌లిరా! స‌భ‌ను మ‌రోసారి పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే. బాప‌ట్లలో నిర్వ‌హిస్తున్న స‌భ‌కు అనుమ‌తి లేద‌ని.. ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. తొక్కుకుంటూ పోతా! అని వ్యాఖ్యానించారు. ఇది రేపో మాపో పోయే ప్ర‌భుత్వం.. దీనిని కాపాడాల‌ని మీరు చూస్తే.. మీ ఉద్యోగాలు ఊడుతాయి. మేం చట్ట ప్రకారం వెళ్తున్నాం.. అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైంది అని చంద్ర‌బాబు అన్నారు.

అంద‌రం వైసీపీ బాధితుల‌మే!

రాష్ట్రంలోని అంద‌రూ దాదాపు వైసీపీ బాధితులే ఉన్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఏం త‌ప్పు చేశాడు. మీ పార్ట‌లో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న మైనింగ్ చేశాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కానీ, ఇప్పుడు మీ పార్టీలో లేడ‌ని ఆయ‌న‌పై అన్ని వేల కోట్ల జ‌రిమానా విధిస్తాడా ఈ జ‌గ‌న్ రెడ్డి? అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తాను స‌హా జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా.. అంద‌రూ.. వైసీపీ బాధితుల‌మేన‌ని అన్నారు. జగన్‌ పెట్టే ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుందన్నారు. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదని అన్నారు.

మ‌ళ్లీ వ‌స్తే.. నాలుగో రాజ‌ధాని అంటాడు!

జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. నాలుగో రాజ‌ధాని క‌డ‌తాన‌ని న‌మ్మిస్తాడ‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డాడ‌ని ఎద్దేవా చేశారు. వై నాట్‌ పులివెందుల అనేదే తమ నినాదమని వెల్ల‌డించారు.

This post was last modified on February 17, 2024 9:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

32 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

12 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

12 hours ago