Political News

అడ్డు వ‌స్తే.. తొక్కుకుంటూ పోతా: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అడ్డు వ‌స్తారా? రండి.. తొక్కుకుంటూ పోతా! ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు. ఇక‌నుంచి మ‌రో ఎత్తు. ఏమ‌నుకుంటున్నారో.. ఖ‌బ‌డ్దార్‌! అని హెచ్చ‌రించారు. కొన్నాళ్లుగా విరామం ప్ర‌క‌టించిన‌.. రా.. క‌ద‌లిరా! స‌భ‌ల‌ను తిరిగి ప్రారంభించిన చంద్ర‌బాబు.. బాప‌ట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎందుకంత కోపం?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంత కోప‌గించుకోవ‌డానికి, నిప్పులు చెర‌గడానికి కార‌ణం.. రా..క‌ద‌లిరా! స‌భ‌ను మ‌రోసారి పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే. బాప‌ట్లలో నిర్వ‌హిస్తున్న స‌భ‌కు అనుమ‌తి లేద‌ని.. ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. తొక్కుకుంటూ పోతా! అని వ్యాఖ్యానించారు. ఇది రేపో మాపో పోయే ప్ర‌భుత్వం.. దీనిని కాపాడాల‌ని మీరు చూస్తే.. మీ ఉద్యోగాలు ఊడుతాయి. మేం చట్ట ప్రకారం వెళ్తున్నాం.. అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైంది అని చంద్ర‌బాబు అన్నారు.

అంద‌రం వైసీపీ బాధితుల‌మే!

రాష్ట్రంలోని అంద‌రూ దాదాపు వైసీపీ బాధితులే ఉన్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఏం త‌ప్పు చేశాడు. మీ పార్ట‌లో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న మైనింగ్ చేశాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కానీ, ఇప్పుడు మీ పార్టీలో లేడ‌ని ఆయ‌న‌పై అన్ని వేల కోట్ల జ‌రిమానా విధిస్తాడా ఈ జ‌గ‌న్ రెడ్డి? అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తాను స‌హా జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా.. అంద‌రూ.. వైసీపీ బాధితుల‌మేన‌ని అన్నారు. జగన్‌ పెట్టే ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుందన్నారు. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదని అన్నారు.

మ‌ళ్లీ వ‌స్తే.. నాలుగో రాజ‌ధాని అంటాడు!

జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. నాలుగో రాజ‌ధాని క‌డ‌తాన‌ని న‌మ్మిస్తాడ‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డాడ‌ని ఎద్దేవా చేశారు. వై నాట్‌ పులివెందుల అనేదే తమ నినాదమని వెల్ల‌డించారు.

This post was last modified on February 17, 2024 9:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

24 minutes ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

1 hour ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

2 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

2 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

3 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

3 hours ago