Political News

అడ్డు వ‌స్తే.. తొక్కుకుంటూ పోతా: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అడ్డు వ‌స్తారా? రండి.. తొక్కుకుంటూ పోతా! ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు. ఇక‌నుంచి మ‌రో ఎత్తు. ఏమ‌నుకుంటున్నారో.. ఖ‌బ‌డ్దార్‌! అని హెచ్చ‌రించారు. కొన్నాళ్లుగా విరామం ప్ర‌క‌టించిన‌.. రా.. క‌ద‌లిరా! స‌భ‌ల‌ను తిరిగి ప్రారంభించిన చంద్ర‌బాబు.. బాప‌ట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎందుకంత కోపం?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంత కోప‌గించుకోవ‌డానికి, నిప్పులు చెర‌గడానికి కార‌ణం.. రా..క‌ద‌లిరా! స‌భ‌ను మ‌రోసారి పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే. బాప‌ట్లలో నిర్వ‌హిస్తున్న స‌భ‌కు అనుమ‌తి లేద‌ని.. ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. తొక్కుకుంటూ పోతా! అని వ్యాఖ్యానించారు. ఇది రేపో మాపో పోయే ప్ర‌భుత్వం.. దీనిని కాపాడాల‌ని మీరు చూస్తే.. మీ ఉద్యోగాలు ఊడుతాయి. మేం చట్ట ప్రకారం వెళ్తున్నాం.. అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైంది అని చంద్ర‌బాబు అన్నారు.

అంద‌రం వైసీపీ బాధితుల‌మే!

రాష్ట్రంలోని అంద‌రూ దాదాపు వైసీపీ బాధితులే ఉన్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఏం త‌ప్పు చేశాడు. మీ పార్ట‌లో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న మైనింగ్ చేశాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కానీ, ఇప్పుడు మీ పార్టీలో లేడ‌ని ఆయ‌న‌పై అన్ని వేల కోట్ల జ‌రిమానా విధిస్తాడా ఈ జ‌గ‌న్ రెడ్డి? అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తాను స‌హా జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా.. అంద‌రూ.. వైసీపీ బాధితుల‌మేన‌ని అన్నారు. జగన్‌ పెట్టే ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుందన్నారు. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదని అన్నారు.

మ‌ళ్లీ వ‌స్తే.. నాలుగో రాజ‌ధాని అంటాడు!

జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. నాలుగో రాజ‌ధాని క‌డ‌తాన‌ని న‌మ్మిస్తాడ‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డాడ‌ని ఎద్దేవా చేశారు. వై నాట్‌ పులివెందుల అనేదే తమ నినాదమని వెల్ల‌డించారు.

This post was last modified on February 17, 2024 9:37 pm

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

2 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

2 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

2 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

3 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

3 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

3 hours ago