Political News

రాష్ట్ర ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచి.. టీడీపీ మేనిఫెస్టో: నారా లోకేష్‌

వైసీపీ పాల‌న‌లో గ‌త ఐదేళ్లుగా ప్ర‌జ‌లు న‌ర‌కం చ‌విచూస్తున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క‌ష్టాలు..క‌న్నీటిని చూసి.. చంద్ర‌బాబు చ‌లించిపోయార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచే టీడీపీ మేనిఫెస్టో త‌యార‌వుతోంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఇప్ప‌టికే గ‌త ఏడాది మ‌హానాడు సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను కూడా మేనిఫెస్టోలో చేర్చ‌నున్నామ‌ని వెల్ల‌డించారు.

ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట‌లో నిర్వ‌హించిన శంఖారావం స‌భ‌లో నారా లోకేష్ మాట్లాడారు. “చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో అనేక మంది క‌న్నీళ్లు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ క‌న్నీళ్లు తుడ‌వాల‌ని.. పేద‌ల జీవితాల్లో భ‌రోసా నింపాల‌ని ఆయ‌న అనుకున్నారు. అందుకే మేనిఫెస్టోను పేద ప్ర‌జ‌ల సెంట్రిక్‌గా త‌యారు చేస్తున్నారు.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక‌, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని లోకేష్ విమ‌ర్శించారు. బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చామన్నారే త‌ప్ప అధికారాలు ఇవ్వ‌లేద‌న్నారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని నిల‌దీశారు. జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. అందుకే ఎమ్మెల్యేల‌ను ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు మారుస్తున్నార‌ని.. అయినా.. పార్టీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని విమ‌ర్శించారు. రెడ్డి నాయ‌కులు కాకుండా.. కేవ‌లం ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయ‌కులనే మారుస్తున్నార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

అంబ‌టి రాయుడిని సీఎం జ‌గ‌న్ అవ‌మానించార‌ని నారా లోకేష్‌ తెలిపారు. ఆయ‌న వైసీపీలోకి వ‌స్తే.. ఎంపీ టికెట్ కోసం కోట్ల రూపాయ‌లు గుంజాల‌ని చూశార‌ని.. ఆరోపించారు. అంత సొమ్ము ఇచ్చుకుని ఓడిపోవ‌డం ఇష్టం లేక‌.. అంబ‌టి రాయుడు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని తెలిపారు. రెడ్‌ బుక్‌ చూసి జగన్‌ వణికిపోతున్నారని, ఆయన కటింగ్‌.. ఫిటింగ్‌ మాస్టర్ అని ఎద్దేవా చేశారు.

This post was last modified on February 17, 2024 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

17 minutes ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

1 hour ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

2 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

6 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago