Political News

రాష్ట్ర ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచి.. టీడీపీ మేనిఫెస్టో: నారా లోకేష్‌

వైసీపీ పాల‌న‌లో గ‌త ఐదేళ్లుగా ప్ర‌జ‌లు న‌ర‌కం చ‌విచూస్తున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క‌ష్టాలు..క‌న్నీటిని చూసి.. చంద్ర‌బాబు చ‌లించిపోయార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచే టీడీపీ మేనిఫెస్టో త‌యార‌వుతోంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఇప్ప‌టికే గ‌త ఏడాది మ‌హానాడు సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను కూడా మేనిఫెస్టోలో చేర్చ‌నున్నామ‌ని వెల్ల‌డించారు.

ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట‌లో నిర్వ‌హించిన శంఖారావం స‌భ‌లో నారా లోకేష్ మాట్లాడారు. “చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో అనేక మంది క‌న్నీళ్లు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ క‌న్నీళ్లు తుడ‌వాల‌ని.. పేద‌ల జీవితాల్లో భ‌రోసా నింపాల‌ని ఆయ‌న అనుకున్నారు. అందుకే మేనిఫెస్టోను పేద ప్ర‌జ‌ల సెంట్రిక్‌గా త‌యారు చేస్తున్నారు.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక‌, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని లోకేష్ విమ‌ర్శించారు. బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చామన్నారే త‌ప్ప అధికారాలు ఇవ్వ‌లేద‌న్నారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని నిల‌దీశారు. జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. అందుకే ఎమ్మెల్యేల‌ను ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు మారుస్తున్నార‌ని.. అయినా.. పార్టీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని విమ‌ర్శించారు. రెడ్డి నాయ‌కులు కాకుండా.. కేవ‌లం ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయ‌కులనే మారుస్తున్నార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

అంబ‌టి రాయుడిని సీఎం జ‌గ‌న్ అవ‌మానించార‌ని నారా లోకేష్‌ తెలిపారు. ఆయ‌న వైసీపీలోకి వ‌స్తే.. ఎంపీ టికెట్ కోసం కోట్ల రూపాయ‌లు గుంజాల‌ని చూశార‌ని.. ఆరోపించారు. అంత సొమ్ము ఇచ్చుకుని ఓడిపోవ‌డం ఇష్టం లేక‌.. అంబ‌టి రాయుడు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని తెలిపారు. రెడ్‌ బుక్‌ చూసి జగన్‌ వణికిపోతున్నారని, ఆయన కటింగ్‌.. ఫిటింగ్‌ మాస్టర్ అని ఎద్దేవా చేశారు.

This post was last modified on February 17, 2024 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

15 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago