Political News

రాష్ట్ర ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచి.. టీడీపీ మేనిఫెస్టో: నారా లోకేష్‌

వైసీపీ పాల‌న‌లో గ‌త ఐదేళ్లుగా ప్ర‌జ‌లు న‌ర‌కం చ‌విచూస్తున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క‌ష్టాలు..క‌న్నీటిని చూసి.. చంద్ర‌బాబు చ‌లించిపోయార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచే టీడీపీ మేనిఫెస్టో త‌యార‌వుతోంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఇప్ప‌టికే గ‌త ఏడాది మ‌హానాడు సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను కూడా మేనిఫెస్టోలో చేర్చ‌నున్నామ‌ని వెల్ల‌డించారు.

ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట‌లో నిర్వ‌హించిన శంఖారావం స‌భ‌లో నారా లోకేష్ మాట్లాడారు. “చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో అనేక మంది క‌న్నీళ్లు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ క‌న్నీళ్లు తుడ‌వాల‌ని.. పేద‌ల జీవితాల్లో భ‌రోసా నింపాల‌ని ఆయ‌న అనుకున్నారు. అందుకే మేనిఫెస్టోను పేద ప్ర‌జ‌ల సెంట్రిక్‌గా త‌యారు చేస్తున్నారు.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక‌, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని లోకేష్ విమ‌ర్శించారు. బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చామన్నారే త‌ప్ప అధికారాలు ఇవ్వ‌లేద‌న్నారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని నిల‌దీశారు. జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. అందుకే ఎమ్మెల్యేల‌ను ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు మారుస్తున్నార‌ని.. అయినా.. పార్టీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని విమ‌ర్శించారు. రెడ్డి నాయ‌కులు కాకుండా.. కేవ‌లం ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయ‌కులనే మారుస్తున్నార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

అంబ‌టి రాయుడిని సీఎం జ‌గ‌న్ అవ‌మానించార‌ని నారా లోకేష్‌ తెలిపారు. ఆయ‌న వైసీపీలోకి వ‌స్తే.. ఎంపీ టికెట్ కోసం కోట్ల రూపాయ‌లు గుంజాల‌ని చూశార‌ని.. ఆరోపించారు. అంత సొమ్ము ఇచ్చుకుని ఓడిపోవ‌డం ఇష్టం లేక‌.. అంబ‌టి రాయుడు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని తెలిపారు. రెడ్‌ బుక్‌ చూసి జగన్‌ వణికిపోతున్నారని, ఆయన కటింగ్‌.. ఫిటింగ్‌ మాస్టర్ అని ఎద్దేవా చేశారు.

This post was last modified on February 17, 2024 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago