నారా బ్రాహ్మణి. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నందమూరి కుటుంబం ఆడపడుచు.. నారా వారి ఇంటి కోడలు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ సతీమణి. ప్రస్తుతం నారా బ్రాహ్మణి.. మంగళగిరిలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన భర్త నారా లోకేష్ను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రాహ్మణి వచ్చారు.ఈ సందర్భంగా ఆమె మంగళగిరిలోని చేనేతలను కలుసుకున్నారు.
మెజారిటీ సామాజిక వర్గం ఇక్కడ చేనేతలే కావడంతో వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నేరుగా వారు పనిచేసే పాకల్లోకే వెళ్లిన నారా బ్రాహ్మణి.. వారి పనితీరును తెలుసుకున్నారు. అదేవిధంగా వారు రోజుకు ఎంత గడిస్తారు? వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న నేస్తం’ పథకంపైనా బ్రాహ్మణి ఆరా తీశారు. ఈ పథకం కింద ఎంతమందికి ఎంత వస్తోందని.. అని అడిగారు. అయితే.. వైసీపీ నాయకులకు జై కొట్టిన వారికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారని మెజారిటీ చేనేతలు తెలిపారు.
ఇలా.. సుమారు 20 మంది చేనేతల ఇళ్లకు తిరిగిన నారా బ్రాహ్మణి.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ను గెలి పించాలని, చంద్రబాబు సీఎం అయితేనే.. మన జీవితాల్లో మార్పు వస్తుందని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఆమె వివరించారు. అనేక మందికి చేతి వృత్తుల పనిముట్లు అందించామన్నారు. నేత కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు మహిళలకు ఆర్థిక సాయం అందించారు.
కాగా, గత ఎన్నికల సమయంలోనూ నారా బ్రాహ్మణి.. నారా లోకేష్ కోసం .. ఇక్కడ ఇంటింటి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తన తండ్రి బాలయ్యతోనూ కలిసి ఆమె ప్రచారరథంపై ఎక్కి ప్రచారం చేశారు. తర్వాత.. తన అత్తగారు, నారా లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరితోనూ కలిసి ప్రచారం చేశారు. కానీ, ఇలా ఎన్నికలకు ముందు రావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
This post was last modified on February 17, 2024 2:23 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…