Political News

‘అందుకే పార్టీలో నుంచి బయటకు వచ్చేశా’

అధికార వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తాజా సంచలనంగా మారారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వేళ.. తాను అలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నానో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నరసరావుపేటలో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తనను గుంటూరుకు షిఫ్టు కావాలని కోరారని.. అందుకు తాను ససేమిరా అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.గుంటూరులో ఓటమి పాలైతే.. తనను రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారని.. అయితే తాను అక్కడకు వెళ్లనని స్పష్టం చేసినట్లుగా పేర్కొన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు కావాలంటూ విధేయత నిరూపించుకోవాలని కొందరు పార్టీ పెద్దలు సూచించినట్లుగా పేర్కొన్నారు. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విపక్షాల్నితిట్టాలని ఎమ్మెల్యేల ద్వారా తనకు సమాచారం పంపారని.. ఆ తీరు తనకు నచ్చలేదన్నారు.

ఈ కారణాలతోనే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లుగా పేర్కొన్నారు. పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వెళ్లామని.. ఆ సందర్భంగా వారికి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాన్ని తిట్టాలన్న సూచన చేశారన్నారు. విధేయత ప్రదర్శించుకోవాలంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయాలన్న మాట చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాను అలాంటి పనులు చేయనని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత తన విదేయతను ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

This post was last modified on February 17, 2024 12:05 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

46 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

2 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

2 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

3 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

3 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 hours ago