Political News

‘అందుకే పార్టీలో నుంచి బయటకు వచ్చేశా’

అధికార వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తాజా సంచలనంగా మారారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వేళ.. తాను అలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నానో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నరసరావుపేటలో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తనను గుంటూరుకు షిఫ్టు కావాలని కోరారని.. అందుకు తాను ససేమిరా అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.గుంటూరులో ఓటమి పాలైతే.. తనను రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారని.. అయితే తాను అక్కడకు వెళ్లనని స్పష్టం చేసినట్లుగా పేర్కొన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు కావాలంటూ విధేయత నిరూపించుకోవాలని కొందరు పార్టీ పెద్దలు సూచించినట్లుగా పేర్కొన్నారు. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విపక్షాల్నితిట్టాలని ఎమ్మెల్యేల ద్వారా తనకు సమాచారం పంపారని.. ఆ తీరు తనకు నచ్చలేదన్నారు.

ఈ కారణాలతోనే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లుగా పేర్కొన్నారు. పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వెళ్లామని.. ఆ సందర్భంగా వారికి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాన్ని తిట్టాలన్న సూచన చేశారన్నారు. విధేయత ప్రదర్శించుకోవాలంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయాలన్న మాట చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాను అలాంటి పనులు చేయనని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత తన విదేయతను ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

This post was last modified on February 17, 2024 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌.. గ‌న్ పేలుతుందా.. !

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు పూర్త‌యిన ద‌రిమిలా.. చంద్ర‌బాబు త‌మ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు ఉన్న సంతృప్తి, అసంతృప్తి…

51 minutes ago

బన్నీతో బంధమే దేవికి తండేల్ ఇచ్చింది

వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి…

54 minutes ago

మదగజరాజ ఇక్కడ దొరికిపోయాడు

పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత…

1 hour ago

ఆదాయ‌పన్ను ఎంత‌? ఎవ‌రికి మిన‌హాయింపు?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లో వేత‌న జీవులు ఆశించిన దానికంటే ఎక్కువ‌గానే మేలు జ‌రిగింద‌ని…

2 hours ago

అప్పుల‌ బాట‌లోనే కేంద్రం.. ఈ ఏడాది 11 ల‌క్ష‌ల కోట్లు!

రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్ర‌బుత్వం కూడా అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. తాజాగా ప్ర‌వేశ పెట్టిన కేంద్ర…

2 hours ago

కియారా అద్వాని….ఏంటీ కహాని ?

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో సినిమాల్లో ఒక్క భరత్ అనే నేను మాత్రమే హిట్టయ్యింది. రామ్ చరణ్ తో…

3 hours ago