Political News

బీఆర్ఎస్‌కు ఏమైంది?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీలో పెను కుదుపులు చోటు చేసుకున్నాయి. ఒక‌రు వెంట ఒక‌రుగా.. పార్టీ నాయ‌కులు జంప్ చేసేస్తున్నారు. ముహూర్తం పెట్టుకుని మ‌రీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. వీరిలో చోటా మోటా నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడితే.. మాజీ మంత్రులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మ‌రో 20 రోజుల్లో షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ జంపింగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. అయితే.. బీఆర్ ఎస్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో బీఆర్ ఎస్‌లో ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది.

కేసీఆర్ బల‌హీనుల‌వుతున్నారా?

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. నాయ‌క‌త్వ‌మే ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని నిల‌బెట్టింద‌నేది వాస్త‌వం. దీనిలో రెండో మాటకు అవ‌కాశం లేదు. అయితే.. గ‌త రెండేళ్ల కాలం నుంచి ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే.. ఆయ‌న కుమార్తె క‌విత‌పై లిక్క‌ర్ కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు వ‌చ్చిన త‌ర్వాత నుంచి కేసీఆర్ డ‌ల్ అయ్యారు. అంత‌కు ముందు ఉన్న గ‌ళం.. దూకుడు త‌గ్గించారు. దేశాన్ని ఏకం చేస్తాన‌ని.. మోడీని గ‌ద్దె దించుతాన‌ని చెప్పిన కేసీఆర్‌.. అనూహ్యంగా ఆ దారి త‌ప్పి.. రాష్ట్రానికే ప‌రిమితం అయ్యారు. అంతేకాదు.. పొరుగున ఉన్న ఏపీలో కూడా పోటీ చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న త‌ర్వాత‌.. మెత్త‌బ‌డ్డారు. ఈ ప‌రిణామాలకు తోడు.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. దీంతో కేసీఆర్ హ‌వా త‌గ్గుతూ వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

పుంజుకున్న రేవంత్‌..

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీ అధికారంలోకి తీసుకురావ‌డంలో స‌క్సెస్ అయ్యారు. బొటాబొటి మెజారిటీనే ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ.. అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాలు.. రేవంత్‌ను ఐకాన్‌గా నిల‌బెడుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఆయ‌న స‌క్సెస్ రేట్ తారా జువ్వ‌లా పుంజుకుం ద‌నే అభిప్రాయం ఉంది. ఈ నేప‌థ్యానికి తోడు.. కేసీఆర్ పాల‌న‌లోని లొసుగులపై అసెంబ్లీ వేదిక‌గా విజృంభిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ స‌హా రేవంత్ గ్రాఫ్ పెరిగింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిణామాల‌తోనే బీఆర్ ఎస్ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇంత జ‌రుగుతు న్నా..కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ.. మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల నాటికి ఈ జంపింగులు మ‌రింత పుంజుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదిలావుంటే.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. తనకు బీఆర్ఎస్ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జడ్ పి చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య కూడా కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్లే నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

This post was last modified on February 17, 2024 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

53 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

13 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

13 hours ago