Political News

చంద్ర‌బాబు ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు యాగాలు, య‌జ్ఞాల బాట ప‌ట్టారు. గ‌త ఏడాది ఆయ‌న ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో ప్ర‌త్యేక య‌జ్ఞాలు జ‌రిపించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో జైలు నుంచి బ‌య‌ట‌కువ‌చ్చిన త‌ర్వాత‌.. పండితుల సూచ‌న‌ల మేర‌కు వీటిని నిర్వ‌హించారు. అయితే.. రాష్ట్ర‌శ్రేయస్సు కోసం నిర్వ‌హించామ‌ని.. స్వ‌యంగా చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి దంప‌తులు వెల్ల‌డించారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు.. అత్యంత శ‌క్తిమాన్విత‌మ‌ని చెప్పే రాజ‌శ్యామ‌ల యాగాన్ని ప్రారంభించారు. ఈ యాగం నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌ల నుంచి ప్ర‌త్యేకంగా పిలిపించిన పురోహితుల‌తో ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా చంద్ర‌బాబు దంప‌తులు ప్రారంభించారు. మంగ‌ళ‌వాద్య ఘోష న‌డుమ‌.. గుమ్మ‌డికాయ కొట్టి ఈ యాగాన్ని చంద్ర‌బాబు స్వ‌యంగా ప్రారంభించారు. నివాసంలోనే అతి పెద్ద రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. అధికారం, ఆరోగ్యం స‌హా.. స‌క‌ల భోగాల‌ను కాంక్షిస్తూ.. ఈ యాగం చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ అధికారంలోకి రావాల‌ని ఆకాంక్షిస్తూ.. విశాఖ‌లోని శార‌దాపీఠం అధిప‌తి.. స్వ‌రూపానందేంద్ర ఈ యాగాన్ని జ‌గ‌న్ చేతుల మీదుగా జ‌రిపించారు.

అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా.. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ యాగం నిర్వ‌హించారు. అయితే.. ఆయ‌న అధికారం ద‌క్కించుకో లేక పోయారు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు వంతు వ‌చ్చింది. మ‌రి ఆయ‌న కోరిక ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. ఇదిలావుంటే.. రాష్ట్రంలోని 150స్థానాల్లో టీడీపీ పోటీ చేయ‌నున్న‌ట్టు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. జ‌న‌సేన‌కు 25 సీట్లు కేటాయిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మేర‌కు ప్రాథ‌మికంగా.. చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on February 16, 2024 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

40 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

13 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

13 hours ago