తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ బాంబు పేల్చారు. ఏకంగా ఎనిమిది మంది బీఆఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. తమ పార్టీలో చేరేందుకు నాయకులు క్యూ కట్టే సమయం వచ్చిందన్నారు. ఎంపీగా పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారని.. అయినా ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావుతో సహా ఎవరైనా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు.
వారి మధ్య అవగాహన ఉంది..
ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పక్షం కాంగ్రెస్కు మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని బండి విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పాలనకు సంబంధించి ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్నప్పటికీ.. కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. అదే.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, కేసీఆర్.. ఎన్డీయేతో జట్టు కడతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్గా ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఎన్డీఏలో చేరుతామనీ అడిగితేనే చేర్చుకోలేదన్నారు.
కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది!
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని బండి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్కి బుద్ది చెప్తారని బండి వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారని గుర్తు చేశారు.
రాముడు-మోడీ!
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు-మోడీ ఒక్కవైఫు, రజాకార్లు, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బీజేపీకి ఓటేస్తారన్నారు. బీఆర్ఎస్ అవినీతి అంతా కాగ్ రిపోర్ట్ ద్వారా బయట పడిందని బండి సంజయ్ చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటుపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు.
This post was last modified on February 16, 2024 8:15 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…