తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ లో ఇప్పుడు రెండు అంశాల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందులో ఒకటి జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఒకటి కాగా.. మంత్రి కేటీఆర్ కు పట్టాభిషేకాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో.. గులాబీ పార్టీలో కొత్త చర్చ షురూ అయ్యింది.
ఇదెంత ఎక్కువగా ఉందంటే.. పార్టీ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టే ముందు ఎమ్మెల్యేలందరికి చెప్పిన తర్వాతే జరుగుతుందని చెప్పినా.. గ్రౌండ్ వర్క్ జోరుగా సాగుతుందని చెబుతున్నారు. తొలుత వినిపించిన విశ్లేషణలకు భిన్నంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే అంశంపై కొత్త వాదన వినిపిస్తోంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టే క్రమంలోనే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయటం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. కేటీఆర్ కు పట్టాభిషేకం చేయటానికి గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని అర్హతగా చూపించనున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్ని ఈ ఏడాది డిసెంబరుకు మొదలు పెట్టి.. జనవరి మొదటి వారానికి పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నారు.
గ్రేటర్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా.. కేటీఆర్ కు కోట్లాది ప్రజల మద్దతు ఉందన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. పట్టాభిషేకానికి ఎలాంటి అడ్డంకులు ఉండవంటున్నారు. సార్వత్రిక ఎన్నికల స్థానే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం.. అదే జరిగితే షెడ్యూల్ కంటే ముందే జరిగే వీలుండటంతో.. వీలైనంత త్వరగా కేటీఆర్ కు పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
This post was last modified on September 9, 2020 2:02 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…