ఆర్. కృష్ణయ్య.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవం అంటూ.. నినదించే గళం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. గతంలో టీడీపీ, తర్వాత వైసీపీలో నూ ఆయన చక్రం తిప్పారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. బీసీల కోసం .. జీవితాన్ని ధార పోశారని చెబుతారు. ఈ నేపథ్యంలో బీసీలను మరింతగా వైసీపీ వైపు మళ్లించుకునేందుకు సీఎం జగన్ ఆయనను ఏరికోరి రాజ్యసభకు పంపించారు.
అయితే.. ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయంలో ఆర్. కృష్ణయ్య అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు .. కీలకమైన బీసీ నాయకుడిగా.. ఏపీ కృష్ణయ్యగా పేరు తెచ్చుకున్న జంగా కృష్ణమూర్తి.. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం అనేది వైసీపీలో నేతి బీరకాయలో నెయ్యి చందమేనని అన్నారు. అంతేకాదు.. సీఎం జగన్ మనసులో కూడా.. బీసీలకు స్తానం లేదని.. ఇక, కార్యాలయాల్లో ఎక్కడ ఉంటుందని.. పదవులు ఎందుకు ఇస్తారని కూడా వ్యాఖ్యానించారు.
ఇలాంటి సమయంలో జోక్యం చేసుకుని జంగాకు కౌంటర్ ఇస్తారని ఆర్. కృష్ణయ్యవైపు వైసీపీ నాయకులు ఆశగా ఎదురు చూశారు. కానీ, ఆయన మాత్రం పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఉలకలేదు.. పలకలేదు. పైగా తనకు తెలియనట్టే వ్యవహరించారు. దీనిని బట్టి ఆర్. కృష్ణయ్య వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారా? లేక.. సీఎం జగన్ నుంచి ఆయనకు ఎలాంటి సందేశాలు వెళ్లలేదా? ఆయన చెబితే తప్ప స్పందించరా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేక పోవడం గమనార్హం.
పైగా బీసీల ఓటు బ్యాంకు కూడా కీలకంగా మారింది. రెడ్డి/కమ్మ వర్గాన్ని కూడా పక్కన పెట్టి… నరసరావు పేట వంటి చోట బీసీలకు జగన్ ప్రాధాన్యం పెంచారు. దీనిని ప్రజలలోకి తీసుకువెళ్లాల్సి ఉంది. అది కూడా బలమైన ఆర్. కృష్ణయ్య వంటివారితోనే సాధ్యమనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ, ఆయన మాత్రం ఢిల్లీకే పరిమితమైనట్టు తెలుస్తోంది. పోనీ.. అక్కడైనా రాజ్యసభలో గళం వినిపిస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. మరి జగన్ ఇచ్చిన పదవిని అనుభవించడానికే ఆయన పరిమితం అవుతారా? లేక పార్టీకి రుణం తీర్చుకుంటారా? అనేది చూడాలి.
This post was last modified on February 16, 2024 6:11 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…