Political News

రేవంత్ పాలనపై జనాల్లో మౌత్ పబ్లిసిటి ఎలా ఉంది?

రాబోయే ఎన్నికల్లో ప్రజాపాలన నినాదమే కాంగ్రెస్ అస్త్రంగా మారబోతోంది. ప్రజాపాలన నినాదంతో రేవంత్ రెడ్డి సామాన్యుల నుంచి మధ్య తరగతి జనాల్లోకి బాగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మెజారిటీ ప్రజల సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహించటం, జనాలకు బాగా ట్రాఫిక్ సమస్యలు సృష్టించిన ప్రగతిభవన్ ముందు ఇనుప కంచెను రోడ్డుమీద నుండి తొలగించటం, కుమారి అంటీ రోడ్డు పక్క క్యాంటిన్ను పోలీసులు తొలగిస్తే వెంటనే స్పందించి మళ్ళీ అక్కడే ఆమె బిజినెస్ చేసుకునేట్లు నిర్ణయించటం ఇలాంటివి సామాన్య జనాల్లో రేవంత్ క్రేజును పెంచాయి.

ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలు కూడా దిగువ, మధ్య తరగతి జనాలు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఇచ్చిన హామీలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రేవంత్ స్పందిస్తున్నారు. రేవంత్ వైఖరి వల్ల ఏమైందంటే పదేళ్ళ కేసీయార్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జనాలు పోలిక చూస్తున్నారు. ప్రతి అంశంలోను కేసీయార్ పరిపాలనను రేవంత్ పాలనలోని తేడాను జనాలు చెప్పుకుంటున్నారు.

రేవంత్ పరిపాలనపై జనాల్లో మౌత్ పబ్లిసిటి చాలా పాజిటివ్ గా ఉంది. ఇలాంటి పాజిటివిటీనే రేవంత్ కోరుకుంటున్నారు. కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మామూలు జనాలను సెక్రటేరియట్ లోకి అడుగు కూడా పెట్టనివ్వలేదు. అలాంటిది రేవంత్ సీఎం కాగానే జనాలందరికీ సెక్రటేరియట్ లోకి అనుమతిచ్చారు. ముఖ్యంగా మీడియా జనాలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే రేవంత్ ప్రతిరోజు సెక్రటేరియట్ కు వస్తున్నారు.

శాఖల వారీగా సమీక్షల్లో ఎక్కువ భాగం సెక్రటేరియట్ లోనే నిర్వహిస్తున్నారు. అదే కేసీయార్ అయితే నెలల తరబడి అసలు సచివాలయానికే వచ్చేవారు కాదు. శాఖల సమీక్షలు ఉండేవి కావు, మంత్రులనూ కలిసేవారు కారు. సెక్రటేరియట్ కే రాని, సమీక్షలు నిర్వహించని, జనాలను కలవని కేసీయార్ కు ముఖ్యమంత్రి పదవి ఎందుకనే జనాలు కూడా అధికారాన్ని ఊడబీకేశారు. ఇవన్నీ రేవంత్ కు ఇపుడు ప్లస్ పాయింట్లవుతున్నాయి. అందుకనే రాబోయే ఎన్నికల్లో ప్రజాపాలన అన్న నినాదాన్నే రాజకీయ అస్త్రంగా ప్రయోగించాలని డిసైడ్ అయ్యింది.

This post was last modified on February 16, 2024 9:51 am

Share

Recent Posts

పిఠాపురం ఆడ‌ప‌డుచుల‌కు ప‌వ‌న్ రాఖీలు!

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక అనుబంధాన్ని…

24 minutes ago

సుమంత్ సరైన దారిలో వెళ్తున్నట్టే

ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…

28 minutes ago

దారిన ప‌డుతున్న నేత‌లు… `వైసీపీకి నో ఛాన్స్‌!`

స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల మ‌ధ్య చిరాకులు, ప‌రాకుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌మ‌కు అది మేలు చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీకి…

1 hour ago

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

3 hours ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

3 hours ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

6 hours ago