Political News

వైసీపీకి ఇది పెద్ద దెబ్బే కదా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తులను గ్రామ వాలంటీర్లుగా నియమించుకుని గ్రామీణ స్థాయిలో అన్ని వ్యవహారాలనూ అదుపులోకి తెచ్చుకుంది. పింఛను డబ్బులు ఇవ్వాలన్నా వాళ్లే. ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా వాళ్లే. ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన విషయమైనా వాళ్ల చేతుల మీదుగానే జరగాలి. వాలంటీర్లుగా ఉన్న వాళ్లందరూ వైసీపీ వాళ్లే అని జగన్, విజయసాయిరెడ్డి లాంటి అగ్ర నేతలే స్వయంగా ప్రకటనలు చేయడం తెలిసిన సంగతే.

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లాంటి కింది స్థాయి నేతలను మించి వైసీపీకి గ్రామ స్థాయిలో వాలంటీర్లే పెద్ద బలంగా మారిపోయారన్నది స్పష్టం. జనాల డేటా అంతా తమ దగ్గర పెట్టుకుని గ్రామ స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి వాలంటీర్లు వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా.

వాలంటీర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని.. ఎన్నికల ప్రక్రియలో ఏ రకంగా భాగమైనా వాళ్ల ప్రభావం చాలా ఉంటుందని.. అధికార పార్టీని గెలిపించడానికి చేయాల్సిందల్లా చేస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. కోర్టు నుంచి ఒక కీలక నిర్ణయం వెలువరించింది ఎన్నికల సంఘం. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునే విషయమై ఈసీ స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని.. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని స్పష్టం చేసింది.

ప్రతి పోలింగ్ బూత్‌లో ఒకరు మాత్రమే ఉండాలని.. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్‌గా పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సీఈవో మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనతో ఉన్న వైసీపీకి ఇది గట్టి ఎదురు దెబ్బే అని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on February 15, 2024 8:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

5 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

7 hours ago