వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తులను గ్రామ వాలంటీర్లుగా నియమించుకుని గ్రామీణ స్థాయిలో అన్ని వ్యవహారాలనూ అదుపులోకి తెచ్చుకుంది. పింఛను డబ్బులు ఇవ్వాలన్నా వాళ్లే. ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా వాళ్లే. ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన విషయమైనా వాళ్ల చేతుల మీదుగానే జరగాలి. వాలంటీర్లుగా ఉన్న వాళ్లందరూ వైసీపీ వాళ్లే అని జగన్, విజయసాయిరెడ్డి లాంటి అగ్ర నేతలే స్వయంగా ప్రకటనలు చేయడం తెలిసిన సంగతే.
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లాంటి కింది స్థాయి నేతలను మించి వైసీపీకి గ్రామ స్థాయిలో వాలంటీర్లే పెద్ద బలంగా మారిపోయారన్నది స్పష్టం. జనాల డేటా అంతా తమ దగ్గర పెట్టుకుని గ్రామ స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి వాలంటీర్లు వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా.
వాలంటీర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని.. ఎన్నికల ప్రక్రియలో ఏ రకంగా భాగమైనా వాళ్ల ప్రభావం చాలా ఉంటుందని.. అధికార పార్టీని గెలిపించడానికి చేయాల్సిందల్లా చేస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. కోర్టు నుంచి ఒక కీలక నిర్ణయం వెలువరించింది ఎన్నికల సంఘం. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునే విషయమై ఈసీ స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని.. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని స్పష్టం చేసింది.
ప్రతి పోలింగ్ బూత్లో ఒకరు మాత్రమే ఉండాలని.. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్గా పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సీఈవో మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనతో ఉన్న వైసీపీకి ఇది గట్టి ఎదురు దెబ్బే అని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…