Political News

వైసీపీకి ఇది పెద్ద దెబ్బే కదా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తులను గ్రామ వాలంటీర్లుగా నియమించుకుని గ్రామీణ స్థాయిలో అన్ని వ్యవహారాలనూ అదుపులోకి తెచ్చుకుంది. పింఛను డబ్బులు ఇవ్వాలన్నా వాళ్లే. ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా వాళ్లే. ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన విషయమైనా వాళ్ల చేతుల మీదుగానే జరగాలి. వాలంటీర్లుగా ఉన్న వాళ్లందరూ వైసీపీ వాళ్లే అని జగన్, విజయసాయిరెడ్డి లాంటి అగ్ర నేతలే స్వయంగా ప్రకటనలు చేయడం తెలిసిన సంగతే.

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లాంటి కింది స్థాయి నేతలను మించి వైసీపీకి గ్రామ స్థాయిలో వాలంటీర్లే పెద్ద బలంగా మారిపోయారన్నది స్పష్టం. జనాల డేటా అంతా తమ దగ్గర పెట్టుకుని గ్రామ స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి వాలంటీర్లు వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా.

వాలంటీర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని.. ఎన్నికల ప్రక్రియలో ఏ రకంగా భాగమైనా వాళ్ల ప్రభావం చాలా ఉంటుందని.. అధికార పార్టీని గెలిపించడానికి చేయాల్సిందల్లా చేస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. కోర్టు నుంచి ఒక కీలక నిర్ణయం వెలువరించింది ఎన్నికల సంఘం. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునే విషయమై ఈసీ స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని.. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని స్పష్టం చేసింది.

ప్రతి పోలింగ్ బూత్‌లో ఒకరు మాత్రమే ఉండాలని.. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్‌గా పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సీఈవో మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనతో ఉన్న వైసీపీకి ఇది గట్టి ఎదురు దెబ్బే అని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on February 15, 2024 8:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

3 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

4 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

4 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

6 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

6 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

8 hours ago