Political News

వైసీపీకి ఇది పెద్ద దెబ్బే కదా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తులను గ్రామ వాలంటీర్లుగా నియమించుకుని గ్రామీణ స్థాయిలో అన్ని వ్యవహారాలనూ అదుపులోకి తెచ్చుకుంది. పింఛను డబ్బులు ఇవ్వాలన్నా వాళ్లే. ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా వాళ్లే. ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన విషయమైనా వాళ్ల చేతుల మీదుగానే జరగాలి. వాలంటీర్లుగా ఉన్న వాళ్లందరూ వైసీపీ వాళ్లే అని జగన్, విజయసాయిరెడ్డి లాంటి అగ్ర నేతలే స్వయంగా ప్రకటనలు చేయడం తెలిసిన సంగతే.

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లాంటి కింది స్థాయి నేతలను మించి వైసీపీకి గ్రామ స్థాయిలో వాలంటీర్లే పెద్ద బలంగా మారిపోయారన్నది స్పష్టం. జనాల డేటా అంతా తమ దగ్గర పెట్టుకుని గ్రామ స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి వాలంటీర్లు వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా.

వాలంటీర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని.. ఎన్నికల ప్రక్రియలో ఏ రకంగా భాగమైనా వాళ్ల ప్రభావం చాలా ఉంటుందని.. అధికార పార్టీని గెలిపించడానికి చేయాల్సిందల్లా చేస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. కోర్టు నుంచి ఒక కీలక నిర్ణయం వెలువరించింది ఎన్నికల సంఘం. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునే విషయమై ఈసీ స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని.. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని స్పష్టం చేసింది.

ప్రతి పోలింగ్ బూత్‌లో ఒకరు మాత్రమే ఉండాలని.. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్‌గా పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సీఈవో మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనతో ఉన్న వైసీపీకి ఇది గట్టి ఎదురు దెబ్బే అని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on February 15, 2024 8:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago