సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు.. తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. బీఆర్ ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ ఇమేజ్కు కూడా తీవ్ర ఇబ్బందిగా మారాయనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. సంపూర్ణంగా నిద్రపట్టే అవకాశం లేదు. పక్కలో బల్లెంలా బీఆర్ ఎస్ వ్యవహార శైలి ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతు.. 64 మాత్రమే. వీరిలో ఓ పది మందిని తమవైపు తిప్పేసుకుంటే.. కొత్తగా ప్రభుత్వం తాము ఏర్పాటు చేసినా చేయకపోయినా.. కాంగ్రెస్ను గద్దె దింపేశామన్న సంతృప్తి బీఆర్ ఎస్కు ఉంటుంది.
ఈ వ్యూహం మనసులో ఉందో ఏమో.. కాంగ్రెస్ ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చటేనని కేసీఆర్ నుంచి కింది స్తాయి నాయకుల వరకు కూడా చాలా మంది చెబుతున్నారు. దీనికి ప్రధాని కారణం.. కేసీఆర్ పార్టీ పరంగా ఓడిపోయినా.. ఆయన ఇమేజ్కు వచ్చిన ఢోకాలేదు. ఇప్పటికీ.. గ్రామీణ ఓటు బ్యాంకులో కేసీఆర్ అంటే.. ‘సార్ లెక్కే’ చూస్తున్నారు. ఈ ఇమేజ్ ఉన్నంత కాలం.. కాంగ్రెస్కు సంకటమే. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా.. తట్టుకునే పరిస్థితి కాంగ్రెస్కు అవసరం.
కానీ, ఈ పరిస్థితి రావాలంటే.. పదిలంగా ఐదేళ్లు ఉండాలంటే.. కాంగ్రెస్ కు బలమైన పునాదులు పడాల్సిన అవసరం కన్నా.. బీఆర్ ఎస్ కు బలమైన నాయకుడిగా ఉన్న కేసీఆర్ను బలహీన పరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సభలో వరుస పెట్టి.. ప్రాజెక్టుల విషయాన్ని.. ఇతర సంక్షేమ పథకాలు, విద్యుత్, రైతుల సమస్యలను కాంగ్రెస్ ఏకరువు పెడుతోంది. తద్వారా.. కేసీఆర్ ఇమేజ్ పై ఆధారపడిన బీఆర్ ఎస్ను వీక్ చేసి.. ప్రజల్లో మరింతగా బీఆర్ ఎస్ సానుకూల పవనాలు తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. బీఆర్ ఎస్ ఓడింది కానీ.. కేసీఆర్ మాత్రం కాదనే వాదన ఉంది. అంటే.. కేసీఆర్ ఇమేజ్కు వచ్చిన ఢోకాలేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ అయినా.. కాంగ్రెస్ నాయకులు అయినా.. బీఆర్ ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కంటే కూడా.. తెలంగాణ తెచ్చామని.. బంగారు పాలన చేశామని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ ఇమేజ్ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది సక్సెస్ అయితే.. బీఆర్ ఎస్ ఎంత బలంగా ఉన్నా.. ఎంత బలహీనంగా ఉన్నా తమకు ఇబ్బంది లేదనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on February 15, 2024 8:51 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…