సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు.. తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. బీఆర్ ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ ఇమేజ్కు కూడా తీవ్ర ఇబ్బందిగా మారాయనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. సంపూర్ణంగా నిద్రపట్టే అవకాశం లేదు. పక్కలో బల్లెంలా బీఆర్ ఎస్ వ్యవహార శైలి ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతు.. 64 మాత్రమే. వీరిలో ఓ పది మందిని తమవైపు తిప్పేసుకుంటే.. కొత్తగా ప్రభుత్వం తాము ఏర్పాటు చేసినా చేయకపోయినా.. కాంగ్రెస్ను గద్దె దింపేశామన్న సంతృప్తి బీఆర్ ఎస్కు ఉంటుంది.
ఈ వ్యూహం మనసులో ఉందో ఏమో.. కాంగ్రెస్ ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చటేనని కేసీఆర్ నుంచి కింది స్తాయి నాయకుల వరకు కూడా చాలా మంది చెబుతున్నారు. దీనికి ప్రధాని కారణం.. కేసీఆర్ పార్టీ పరంగా ఓడిపోయినా.. ఆయన ఇమేజ్కు వచ్చిన ఢోకాలేదు. ఇప్పటికీ.. గ్రామీణ ఓటు బ్యాంకులో కేసీఆర్ అంటే.. ‘సార్ లెక్కే’ చూస్తున్నారు. ఈ ఇమేజ్ ఉన్నంత కాలం.. కాంగ్రెస్కు సంకటమే. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా.. తట్టుకునే పరిస్థితి కాంగ్రెస్కు అవసరం.
కానీ, ఈ పరిస్థితి రావాలంటే.. పదిలంగా ఐదేళ్లు ఉండాలంటే.. కాంగ్రెస్ కు బలమైన పునాదులు పడాల్సిన అవసరం కన్నా.. బీఆర్ ఎస్ కు బలమైన నాయకుడిగా ఉన్న కేసీఆర్ను బలహీన పరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సభలో వరుస పెట్టి.. ప్రాజెక్టుల విషయాన్ని.. ఇతర సంక్షేమ పథకాలు, విద్యుత్, రైతుల సమస్యలను కాంగ్రెస్ ఏకరువు పెడుతోంది. తద్వారా.. కేసీఆర్ ఇమేజ్ పై ఆధారపడిన బీఆర్ ఎస్ను వీక్ చేసి.. ప్రజల్లో మరింతగా బీఆర్ ఎస్ సానుకూల పవనాలు తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. బీఆర్ ఎస్ ఓడింది కానీ.. కేసీఆర్ మాత్రం కాదనే వాదన ఉంది. అంటే.. కేసీఆర్ ఇమేజ్కు వచ్చిన ఢోకాలేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ అయినా.. కాంగ్రెస్ నాయకులు అయినా.. బీఆర్ ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కంటే కూడా.. తెలంగాణ తెచ్చామని.. బంగారు పాలన చేశామని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ ఇమేజ్ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది సక్సెస్ అయితే.. బీఆర్ ఎస్ ఎంత బలంగా ఉన్నా.. ఎంత బలహీనంగా ఉన్నా తమకు ఇబ్బంది లేదనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on February 15, 2024 8:51 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…