Political News

బీఆర్ఎస్ కు ఎంఎల్ఏల షాక్

బీఆర్ఎస్ అధిష్టానానికి సొంత ఎంఎల్ఏలే పెద్ద షాకిచ్చారు. విషయం ఏమిటంటే అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరపున మెజారిటి సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. అదే బీఆర్ఎస్ లో చూస్తే చాలామంది హాజరుకావటంలేదు. నల్గొండ బహిరంగసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీయార్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై బుధవారం సభ దద్దరిల్లిపోయింది. రేవంత్ అండ్ కో కేసీయార్ తో పాటు బీఆర్ఎస్ ను అంతేస్ధాయిలో ఎదురుదాడికి దిగారు.

దాంతో రెండువైపులా ఆరోపణలు, విమర్శలతో సమావేశాలు చాలా ఉద్రిక్తంగా జరిగాయి. కాంగ్రెస్ ధాటిని తట్టుకోలేక చివరకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సభనుండి వాకౌట్ చేయాల్సొచ్చింది. సభ నుండి వాకౌట్ చేయాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది ? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఎక్కువమంది కనబడటంలేదు కాబట్టే. బుధవారం సమావేశానికి పట్టుమని పదిమంది కూడా కనబడలేదట. దీన్ని గమనించి కేటీయార్, హరీష్ రావులు ఎంఎల్ఏలకు ఫోన్లుచేశారట. దాంతో సమావేశాలు మొదలైన తర్వాత అసెంబ్లీలో 15 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కనిపించారు.

తర్వాత సభ నుండి వాకౌట్ చేసినా ఆ తర్వాత ధర్నా చేసినా 15 మంది ఎంఎల్ఏలకన్నా కనబడలేదు. పార్టీకి ఉన్న 39 మంది ఎంఎల్ఏల్లో 15 మంది మాత్రమే సభకు హాజరవుతున్నారంటే అర్ధమేంటి ? మిగిలిన 24 మంది ఎంఎల్ఏలు అసెంబ్లీకి ఎందుకు హాజరుకావటంలేదనే విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు కేసీయార్, కేటీయార్, హరీష్ రావులను రేవంత్ రెడ్డి, మంత్రులు వాయించేస్తుంటే తమను తాము డిఫెండ్ చేసుకోవటానికి కూడా ఎంఎల్ఏల మద్దతు దొరకటంలేదు.

ఈ పరిస్ధితిని గ్రహించే కేసీయార్ అసలు అసెంబ్లీకే రాలేదు. ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేసిన కేసీయార్ నల్గొండలో జరిగిన బహిరంగసభకు వీల్ చైర్లో వెళ్ళారు కాని అసెంబ్లీకి మాత్రం రావాలని అనుకోలేదు. కారణం ఏమిటంటే రేవంత్ అండ్ కో ధాటిని తట్టుకోలేమన్న ఆలోచనతోనే అని పార్టీవర్గాల సమాచారం. సమావేశాలకు 24 మంది ఎంఎల్ఏలు గైర్హాజరవుతున్నారంటే ఇదేదో సీరియస్ విషయంగానే ఉంది. ఎందుకంటే కొందరు ఎంఎల్ఏలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు జరుగుతన్న ప్రచారం తెలిసిందే. సభకు గైర్హాజరవ్వటం కూడా ఇందులో బాగమేనా ?

This post was last modified on February 15, 2024 11:54 am

Share
Show comments

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

46 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago