టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూ డదని ఆయన వ్యాఖ్యానించారు. మరో మూడు రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగియనుం ది. ఈ నెల 27న ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి అన్నీ ఎమ్మెల్యేల కోటాలోనే ఉన్న నేపథ్యంలో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించిం ది. ఒకటి వైవీ సుబ్బారెడ్డి, రెండోది ఎస్సీ నాయకుడు గోల్ల బాబూరావు, మూడోది కూడా రెడ్డి వర్గానికే కేటాయించింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఒక అభ్యర్థిని పోటీ పెడతారని కొన్ని రోజులుగా రాజకీయ చర్చలు సాగాయి. అయితే.. తాజా గా పార్టీ కీలక నేతలతో నిర్వహించిన ప్రత్యేక భేటీలో చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల గురించి చర్చించారు. అసెంబ్లీలో బలం లేకుండా.. ఎన్నికలకు వెళ్తే.. చెడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని.. పైగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నందున.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు వెళ్తే.. మన దృష్టి మళ్లుతుందని.. వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వరాదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం అయినట్టు స్పష్టమైంది.
ప్రస్తుతం టీడీపీ తరఫున కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే రాజ్యసభలో నేరుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ యన సభ్యత్వం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారని.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి జై కొడతారని.. పార్టీ వర్గాలు అంచనా వేసుకున్నాయి. అదికూడా మరోసారి కనకమేడలకే అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు అసలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…