తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. మాజీ సీఎం, బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్.. “ఏం పీకనీకి పోయినవ్” అంటూ.. సీఎంను విమర్శించడాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ తీవ్రంగా పరిగణించారు. ఇదేనా సంప్రదాయం.. అంటూ నిలదీశారు. ఇప్పటికే 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ ఫ్యాంటు ఊడబీకారని.. ఇక, మిగి లిన అంగీని కూడా లాగేసేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎంరేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది.
ఏం జరిగిందంటే..
మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. “మేడిగడ్డ దగ్గరకు ఎందుకు పోయిండో తెల్వదు. ఏం పీకనీకి పోయిండో తెల్వదు. కానీ, పోయిన్రు. ఇదీ.. కాంగ్రెస్ పాలన. సూర్యుడి లెక్కున్న నాపై దుమ్ము పోయాలని చూస్తున్రు” అని కేసీఆర్ అన్నారు.
ఈ వ్యాఖ్యలను అసెంబ్లీలో బుధవారం ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసి, నాలుగు సార్లు పార్లమెంటుకు వెళ్లి, కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇలానా.. మాట్లాడేది? అంటూ.. ఫైర్ అయ్యారు. అంతేకాదు..”కాళేశ్వరం అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతరా అంటూ ప్రశ్నిస్తున్నారు.కేసీఆర్ చచ్చిన పాము. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది” అని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడినా కూడా కేసీఆర్కు బుద్ధి రాలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా అని సభలో ప్రశ్నించారు. మేడిగడ్డలో నీళ్లు నింపి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారని గుర్తుచేస్తూ.. మొన్నటి వరకు ఆ శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రులకే ఆ బాధ్యత అప్పగిస్తామని, ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
This post was last modified on February 14, 2024 4:09 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…