రాజధానిపై వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కంటిన్యూ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైవీ ఈ కొత్త డిమాండ్ ను తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కావటంలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం పొడిగించాలని అధికారపార్టీ నేతలు ఎవరూ, ఎప్పుడూ ప్రస్తావించలేదు.
విభజన చట్టం ప్రకారం ఏపీ-తెలంగాణాకు హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలిసిందే. పేరుకే ఉమ్మడి రాజధాని కాని హైదరాబాద్ నుండి చేసిన పరిపాలన ఏమీలేదు. కాబట్టి వైవీ డిమాండ్ చేస్తున్నట్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించాలనే డిమాండులో అర్ధం లేదు. ఒకవేళ కేంద్రం పొడిగించినా ఏపీకి జరిగే ఉపయోగం ఏమీలేదు. ఏ కోణంలో చూసినా ఎలాంటి ఉపయోగంలేని డిమాండును వైవీ సడెన్ గా ఎందుకు మొదలుపెట్టారో అర్ధంకావటంలేదు.
మాజీ ఎంపీ చెబుతున్నది ఏమిటంటే విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్మించేంతవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలట. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మించేదెప్పుడు ? పైగా వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రకటించలేదు. బాగా డెవలప్ అయిన విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారంతే. కొతమొత్తం ఖర్చులు పెట్టుకుంటే పరిపాలనా రాజధానిగా వైజాగ్ అయిపోతుందని మాత్రమే జగన్ చెప్పారు. దీనికోసం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిన అవసరంలేదు. ఈ డిమాండ్ చేయటం కన్నా హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తే ఏమన్నా ఉపయోగముంటుందేమో.
జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యే సమయానికి ఎన్నికలు జరిగిపోతాయి. జగనే రెండోసారి గెలిస్తే వైజాగ్ పరిపాలనా రాజధాని అయిపోవటం ఖాయం. ఒకవేళ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతే రాజధానిగా కంటిన్యు అవుతుందనటంలో సందేహంలేదు. కాబట్టి కొత్త డిమాండ్లతో జనాల్లో అనవసరమైన గందరగోళం పెంచటం తప్ప మరే ఉపయోగం లేదు.
This post was last modified on February 14, 2024 12:52 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…