Political News

రాజధానిపై కొత్త డ్రామా

రాజధానిపై వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కంటిన్యూ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైవీ ఈ కొత్త డిమాండ్ ను తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కావటంలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం పొడిగించాలని అధికారపార్టీ నేతలు ఎవరూ, ఎప్పుడూ ప్రస్తావించలేదు.

విభజన చట్టం ప్రకారం ఏపీ-తెలంగాణాకు హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలిసిందే. పేరుకే ఉమ్మడి రాజధాని కాని హైదరాబాద్ నుండి చేసిన పరిపాలన ఏమీలేదు. కాబట్టి వైవీ డిమాండ్ చేస్తున్నట్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించాలనే డిమాండులో అర్ధం లేదు. ఒకవేళ కేంద్రం పొడిగించినా ఏపీకి జరిగే ఉపయోగం ఏమీలేదు. ఏ కోణంలో చూసినా ఎలాంటి ఉపయోగంలేని డిమాండును వైవీ సడెన్ గా ఎందుకు మొదలుపెట్టారో అర్ధంకావటంలేదు.

మాజీ ఎంపీ చెబుతున్నది ఏమిటంటే విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్మించేంతవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలట. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మించేదెప్పుడు ? పైగా వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రకటించలేదు. బాగా డెవలప్ అయిన విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారంతే. కొతమొత్తం ఖర్చులు పెట్టుకుంటే పరిపాలనా రాజధానిగా వైజాగ్ అయిపోతుందని మాత్రమే జగన్ చెప్పారు. దీనికోసం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిన అవసరంలేదు. ఈ డిమాండ్ చేయటం కన్నా హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తే ఏమన్నా ఉపయోగముంటుందేమో.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యే సమయానికి ఎన్నికలు జరిగిపోతాయి. జగనే రెండోసారి గెలిస్తే వైజాగ్ పరిపాలనా రాజధాని అయిపోవటం ఖాయం. ఒకవేళ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతే రాజధానిగా కంటిన్యు అవుతుందనటంలో సందేహంలేదు. కాబట్టి కొత్త డిమాండ్లతో జనాల్లో అనవసరమైన గందరగోళం పెంచటం తప్ప మరే ఉపయోగం లేదు.

This post was last modified on February 14, 2024 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

7 hours ago