Political News

రాజధానిపై కొత్త డ్రామా

రాజధానిపై వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కంటిన్యూ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైవీ ఈ కొత్త డిమాండ్ ను తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కావటంలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం పొడిగించాలని అధికారపార్టీ నేతలు ఎవరూ, ఎప్పుడూ ప్రస్తావించలేదు.

విభజన చట్టం ప్రకారం ఏపీ-తెలంగాణాకు హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలిసిందే. పేరుకే ఉమ్మడి రాజధాని కాని హైదరాబాద్ నుండి చేసిన పరిపాలన ఏమీలేదు. కాబట్టి వైవీ డిమాండ్ చేస్తున్నట్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించాలనే డిమాండులో అర్ధం లేదు. ఒకవేళ కేంద్రం పొడిగించినా ఏపీకి జరిగే ఉపయోగం ఏమీలేదు. ఏ కోణంలో చూసినా ఎలాంటి ఉపయోగంలేని డిమాండును వైవీ సడెన్ గా ఎందుకు మొదలుపెట్టారో అర్ధంకావటంలేదు.

మాజీ ఎంపీ చెబుతున్నది ఏమిటంటే విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్మించేంతవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలట. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మించేదెప్పుడు ? పైగా వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రకటించలేదు. బాగా డెవలప్ అయిన విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారంతే. కొతమొత్తం ఖర్చులు పెట్టుకుంటే పరిపాలనా రాజధానిగా వైజాగ్ అయిపోతుందని మాత్రమే జగన్ చెప్పారు. దీనికోసం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిన అవసరంలేదు. ఈ డిమాండ్ చేయటం కన్నా హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తే ఏమన్నా ఉపయోగముంటుందేమో.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యే సమయానికి ఎన్నికలు జరిగిపోతాయి. జగనే రెండోసారి గెలిస్తే వైజాగ్ పరిపాలనా రాజధాని అయిపోవటం ఖాయం. ఒకవేళ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతే రాజధానిగా కంటిన్యు అవుతుందనటంలో సందేహంలేదు. కాబట్టి కొత్త డిమాండ్లతో జనాల్లో అనవసరమైన గందరగోళం పెంచటం తప్ప మరే ఉపయోగం లేదు.

This post was last modified on February 14, 2024 12:52 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

30 mins ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

36 mins ago

లవ్ మీ మీద బండెడు బరువు

సింగల్ స్క్రీన్లు అధిక శాతం తాత్కాలికంగా మూతబడి, కుంటినడనన మల్టీప్లెక్సులను నెట్టుకొస్తున్న టైంలో ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ లవ్…

2 hours ago

భైరవ బుజ్జిలను తక్కువంచనా వేయొద్దు

నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి…

3 hours ago

కుప్పం బాబుకు లక్ష ‘కప్పం’ చెల్లిస్తుందా ?

కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప…

3 hours ago

మీడియం హీరోల డిజిటల్ కష్టాలు

స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా…

4 hours ago