Political News

రాజధానిపై కొత్త డ్రామా

రాజధానిపై వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కంటిన్యూ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైవీ ఈ కొత్త డిమాండ్ ను తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కావటంలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం పొడిగించాలని అధికారపార్టీ నేతలు ఎవరూ, ఎప్పుడూ ప్రస్తావించలేదు.

విభజన చట్టం ప్రకారం ఏపీ-తెలంగాణాకు హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలిసిందే. పేరుకే ఉమ్మడి రాజధాని కాని హైదరాబాద్ నుండి చేసిన పరిపాలన ఏమీలేదు. కాబట్టి వైవీ డిమాండ్ చేస్తున్నట్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించాలనే డిమాండులో అర్ధం లేదు. ఒకవేళ కేంద్రం పొడిగించినా ఏపీకి జరిగే ఉపయోగం ఏమీలేదు. ఏ కోణంలో చూసినా ఎలాంటి ఉపయోగంలేని డిమాండును వైవీ సడెన్ గా ఎందుకు మొదలుపెట్టారో అర్ధంకావటంలేదు.

మాజీ ఎంపీ చెబుతున్నది ఏమిటంటే విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్మించేంతవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలట. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మించేదెప్పుడు ? పైగా వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రకటించలేదు. బాగా డెవలప్ అయిన విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారంతే. కొతమొత్తం ఖర్చులు పెట్టుకుంటే పరిపాలనా రాజధానిగా వైజాగ్ అయిపోతుందని మాత్రమే జగన్ చెప్పారు. దీనికోసం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిన అవసరంలేదు. ఈ డిమాండ్ చేయటం కన్నా హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తే ఏమన్నా ఉపయోగముంటుందేమో.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యే సమయానికి ఎన్నికలు జరిగిపోతాయి. జగనే రెండోసారి గెలిస్తే వైజాగ్ పరిపాలనా రాజధాని అయిపోవటం ఖాయం. ఒకవేళ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతే రాజధానిగా కంటిన్యు అవుతుందనటంలో సందేహంలేదు. కాబట్టి కొత్త డిమాండ్లతో జనాల్లో అనవసరమైన గందరగోళం పెంచటం తప్ప మరే ఉపయోగం లేదు.

This post was last modified on February 14, 2024 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

45 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

59 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago