ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కొద్ది రోజుల నుంచి రోజుకు దాదాపుగా పది వేల కేసులకు పైగా నమోదవడం కలవరపెడుతోంది. మరోవైపు, దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో 70 శాతం కరోనా మరణాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది.
దీంతో పాటు, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 శాతం కేసులు వస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీపై మరో బ్యాడ్ రిమార్క్ పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
ఆగస్టు నెలకుగాను దేశవ్యాప్తంగా 8.1 శాతం నిరుద్యోగం నమోదైందని సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. పట్టణాల్లో 9.5 శాతం, గ్రామాల్లో 7.4 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సీఎంఐఈ వెల్లడించింది.
ఏపీలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతోంది. ఓ వైపు కరోనా మహమ్మారి భయం….మరో వైపు నిరుద్యోగం…వెరసి ఏపీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిరుద్యోగ శాతం విస్తరిస్తోంది. కరోనా పుణ్యమా అంటూ అధిక శాతం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఈ పరిస్థితి మరింత పెరిగినట్టు అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్తు మరింత ఆందోళనగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా నిరుద్యోగభూతం భయాందోళనలకు గురిచేస్తోందని సీఎఐఈ వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను దేశవ్యాప్తంగా 8.1 శాతం నిరుద్యోగం నమోదైందని వెల్లడించింది. ఈ నివేదికలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ 7 శాతం నిరుద్యోగంతో రెండో స్థానంలో నిలిచింది.
కర్ణాటక 0.5 శాతం నిరుద్యోగంతో చివరి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రం కర్ణాటక కావడ విశేషం. ఇక, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుల్లో 5.8 శాతం నిరుద్యోగం నమోదైంది. దేశవ్యాప్తంగా హరియాణా 33.5 శాతం నిరుద్యోగంతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాదిలో కేరళ 11 శాతం నిరుద్యోగంతో మొదటి స్థానంలో నిలిచింది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…