ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కొద్ది రోజుల నుంచి రోజుకు దాదాపుగా పది వేల కేసులకు పైగా నమోదవడం కలవరపెడుతోంది. మరోవైపు, దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో 70 శాతం కరోనా మరణాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది.
దీంతో పాటు, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 శాతం కేసులు వస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీపై మరో బ్యాడ్ రిమార్క్ పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
ఆగస్టు నెలకుగాను దేశవ్యాప్తంగా 8.1 శాతం నిరుద్యోగం నమోదైందని సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. పట్టణాల్లో 9.5 శాతం, గ్రామాల్లో 7.4 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సీఎంఐఈ వెల్లడించింది.
ఏపీలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతోంది. ఓ వైపు కరోనా మహమ్మారి భయం….మరో వైపు నిరుద్యోగం…వెరసి ఏపీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిరుద్యోగ శాతం విస్తరిస్తోంది. కరోనా పుణ్యమా అంటూ అధిక శాతం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఈ పరిస్థితి మరింత పెరిగినట్టు అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్తు మరింత ఆందోళనగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా నిరుద్యోగభూతం భయాందోళనలకు గురిచేస్తోందని సీఎఐఈ వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను దేశవ్యాప్తంగా 8.1 శాతం నిరుద్యోగం నమోదైందని వెల్లడించింది. ఈ నివేదికలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ 7 శాతం నిరుద్యోగంతో రెండో స్థానంలో నిలిచింది.
కర్ణాటక 0.5 శాతం నిరుద్యోగంతో చివరి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రం కర్ణాటక కావడ విశేషం. ఇక, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుల్లో 5.8 శాతం నిరుద్యోగం నమోదైంది. దేశవ్యాప్తంగా హరియాణా 33.5 శాతం నిరుద్యోగంతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాదిలో కేరళ 11 శాతం నిరుద్యోగంతో మొదటి స్థానంలో నిలిచింది.
This post was last modified on September 9, 2020 10:33 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…