తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. మరోసారి సెంటిమెంటు డైలాగులు పేల్చారు. పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. తొలిసారి ఆయన నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. “కాలు విరిగినా.. కట్టెపట్టుకుని నల్లగొండకు వచ్చినా” అంటూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సారి ఆయన సభలో కుర్చీలో కూర్చునే మాట్లాడడం గమనార్హం. తుంటి ఆపరేషన్ జరగడంతో నిలబడలేక పోతున్న నేపథ్యంలో సభలో కూర్చుని ప్రసంగించారు. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అని కేసీఆర్ పేర్కొన్నారు.
నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదన్న కేసీఆర్.. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలకుల పుణ్యమా అని ఫ్లోరైడ్ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగి పోయాయని, కాళ్లు మెలితిరిగిపోయాయని తెలిపారు. అయితే.. ఈ సమస్యను తాము గత పదేళ్ల పాలనలో పరిష్కరించేందుకు మనసా వాచా కర్మణా పనిచేశామన్నారు. ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానికి చూపించామన్నారు.
ఇక, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా కేసీఆర్ ఇదే వేదికగా సమాధానం చెప్పారు. ఓట్లు వచ్చినప్పుడే కొందరు ప్రజల వద్దకు వస్తారని అన్న ఆయన.. తాను నిరంతరం.. పక్షిలాగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగానని తెలిపారు. తన పాలనలో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపోవడంతో తనకు నిద్దర పట్టేది కాదన్నారు. అందుకే.. అనేక సందర్భాల్లో జల విషయాలపై పోరాటం చేశామన్నారు. తమ హయాంలో చేపట్టిన బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యిందని, డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. “నా ప్రాంతం.. నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా పోరాడవచ్చు” అని తెలిపారు.
This post was last modified on February 13, 2024 8:39 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…