Political News

కాలు విరిగినా.. క‌ట్టె ప‌ట్టుకుని న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చినా: కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. మ‌రోసారి సెంటిమెంటు డైలాగులు పేల్చారు. పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. తొలిసారి ఆయ‌న న‌ల్ల‌గొండ‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. “కాలు విరిగినా.. క‌ట్టెప‌ట్టుకుని న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చినా” అంటూ.. త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. ఈ సారి ఆయ‌న స‌భ‌లో కుర్చీలో కూర్చునే మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. తుంటి ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌డంతో నిల‌బ‌డ‌లేక పోతున్న నేప‌థ్యంలో స‌భ‌లో కూర్చుని ప్ర‌సంగించారు. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అని కేసీఆర్ పేర్కొన్నారు.

నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదన్న కేసీఆర్‌.. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆస‌న్న‌మైందని తెలిపారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నల్లగొండలో ఫ్లోరైడ్‌ సమస్య పోయిందని తెలిపారు. గ‌తంలో కాంగ్రెస్ పాల‌కుల పుణ్య‌మా అని ఫ్లోరైడ్‌ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగి పోయాయని, కాళ్లు మెలితిరిగిపోయాయ‌ని తెలిపారు. అయితే.. ఈ స‌మ‌స్య‌ను తాము గ‌త ప‌దేళ్ల పాల‌న‌లో ప‌రిష్క‌రించేందుకు మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా ప‌నిచేశామ‌న్నారు. ఫ్లోరైడ్‌ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానికి చూపించామ‌న్నారు.

ఇక‌, కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా కేసీఆర్ ఇదే వేదిక‌గా స‌మాధానం చెప్పారు. ఓట్లు వచ్చినప్పుడే కొందరు ప్రజల వద్దకు వస్తారని అన్న ఆయ‌న‌.. తాను నిరంత‌రం.. ప‌క్షిలాగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాన‌ని తెలిపారు. త‌న పాల‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి అన్యాయం చేయ‌లేద‌న్నారు. పక్క‌నే కృష్ణ‌మ్మ ఉన్నా.. ఫ‌లితం లేక‌పోవ‌డంతో త‌న‌కు నిద్ద‌ర ప‌ట్టేది కాద‌న్నారు. అందుకే.. అనేక సంద‌ర్భాల్లో జ‌ల విష‌యాల‌పై పోరాటం చేశామ‌న్నారు. త‌మ హ‌యాంలో చేప‌ట్టిన బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యిందని, డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని కేసీఆర్ వెల్ల‌డించారు. “నా ప్రాంతం.. నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా పోరాడవచ్చు” అని తెలిపారు.

This post was last modified on February 13, 2024 8:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

8 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

23 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago