తెలుగు నుంచి బాలీవుడ్ వరకు.. అనేక సినిమాలు చేసిన నటి, రాజకీయంగా కూడా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు.. జయప్రద. అయితే.. ఇప్పుడు ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమెను తక్షణం.. ఎక్కడున్నా అరెస్టు చేయండి! అని కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు. మరి ఇంతకీ ఏంజరిగింది? ఎందుకు కోర్టు ఇంతగా రియాక్ట్ అయింది? అనేది ఆసక్తిగా మారింది.
టీడీపీలో ప్రారంభించిన జయప్రద రాజకీయం.. యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద.. తర్వాత అక్కడ ఏర్పడిన ఉత్తరాది పరిచయాలతో యూపీలోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అక్కడే రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాజకీయంగా దూరంగా ఉన్నారు. అయితే.. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.
దీని నుంచి ఇంకా బయటకు రాకముందే.. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే తాజాగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్ ఎస్పీని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…