తెలుగు నుంచి బాలీవుడ్ వరకు.. అనేక సినిమాలు చేసిన నటి, రాజకీయంగా కూడా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు.. జయప్రద. అయితే.. ఇప్పుడు ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమెను తక్షణం.. ఎక్కడున్నా అరెస్టు చేయండి! అని కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు. మరి ఇంతకీ ఏంజరిగింది? ఎందుకు కోర్టు ఇంతగా రియాక్ట్ అయింది? అనేది ఆసక్తిగా మారింది.
టీడీపీలో ప్రారంభించిన జయప్రద రాజకీయం.. యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద.. తర్వాత అక్కడ ఏర్పడిన ఉత్తరాది పరిచయాలతో యూపీలోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అక్కడే రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాజకీయంగా దూరంగా ఉన్నారు. అయితే.. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.
దీని నుంచి ఇంకా బయటకు రాకముందే.. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే తాజాగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్ ఎస్పీని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…