తెలుగు నుంచి బాలీవుడ్ వరకు.. అనేక సినిమాలు చేసిన నటి, రాజకీయంగా కూడా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు.. జయప్రద. అయితే.. ఇప్పుడు ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమెను తక్షణం.. ఎక్కడున్నా అరెస్టు చేయండి! అని కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు. మరి ఇంతకీ ఏంజరిగింది? ఎందుకు కోర్టు ఇంతగా రియాక్ట్ అయింది? అనేది ఆసక్తిగా మారింది.
టీడీపీలో ప్రారంభించిన జయప్రద రాజకీయం.. యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద.. తర్వాత అక్కడ ఏర్పడిన ఉత్తరాది పరిచయాలతో యూపీలోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అక్కడే రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాజకీయంగా దూరంగా ఉన్నారు. అయితే.. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.
దీని నుంచి ఇంకా బయటకు రాకముందే.. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే తాజాగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్ ఎస్పీని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
This post was last modified on February 13, 2024 4:39 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…