తెలుగు నుంచి బాలీవుడ్ వరకు.. అనేక సినిమాలు చేసిన నటి, రాజకీయంగా కూడా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు.. జయప్రద. అయితే.. ఇప్పుడు ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమెను తక్షణం.. ఎక్కడున్నా అరెస్టు చేయండి! అని కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు. మరి ఇంతకీ ఏంజరిగింది? ఎందుకు కోర్టు ఇంతగా రియాక్ట్ అయింది? అనేది ఆసక్తిగా మారింది.
టీడీపీలో ప్రారంభించిన జయప్రద రాజకీయం.. యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద.. తర్వాత అక్కడ ఏర్పడిన ఉత్తరాది పరిచయాలతో యూపీలోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అక్కడే రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాజకీయంగా దూరంగా ఉన్నారు. అయితే.. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.
దీని నుంచి ఇంకా బయటకు రాకముందే.. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే తాజాగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్ ఎస్పీని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
This post was last modified on February 13, 2024 4:39 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…