ఏపీలో రహదారులు బాగోలేదని.. ఎక్కడికక్కడ గుంతలు.. అతుకులే కనిపిస్తున్నాయని.. కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాలు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదు. అంతేకాదు.. అసలు ఎవరు ఎన్ని మాటలు అన్నా.. పట్టించుకున్న దాఖలా కూడా లేదు. పోనీ.. ఎన్నికలకు ముందైనా.. రహదారులను పట్టించుకుంటారని.. రోడ్లు వేస్తారని అనుకుందామన్నా.. అసలు ఆ ఊసే లేకుండా పోయింది.
పోనీలే.. సంక్షేమ పథకాలకు నిధులు చాలక.. రోడ్లు వేయడం లేదేమో.. అని సరిపెట్టుకుందామా? అంటే.. అయిన వారి ఇళ్లకు.. కావాల్సిన వారి ఫాం హౌస్లకు ప్రభుత్వం తన సొంత నిధులతో రహదారు లను అద్దంలా నిర్మిస్తోంది. కొన్నాళ్ల కిందట మంత్రి బొత్స ఇంటి ముందు.. రోడ్డు వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు సీఎం జగన్ చిన్నాన్న.. వైసీపీ కీలక నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఫాం హౌస్(వ్యవసాయ క్షేత్రం) కు సర్కారు.. అద్దం లాంటి రోడ్డు నిర్మించడం మరింత చర్చకు దారితీసింది.
ఎక్కడంటే..
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు పంచాయతీ పరిధిలో వైసీపీముఖ్య నాయకుడు.. కాలం కలిసి వస్తే. త్వరలోనే రాజ్యసభకు కూడా వెళ్లనున్న వైవీ సుబ్బారెడ్డి సోదరులకు సుమారు వంద ఎకరాల మేర ఫాం హౌస్లు, పండ్ల తోటలు ఉన్నాయి. అక్కడకు చేరుకునేందుకు గతంలో మట్టి రోడ్డు ఉండేది. ఇటీవల ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి 2.5 కి.మీ. మేర రోడ్డు వేసేశారు.
వాస్తవానికి ఈ మార్గంలో ఒక్క ఇల్లు లేకపోయినా సరే వైవీ సోదరుల కోసమే దీనిని నిర్మించారనే విమర్శలు వస్తున్నాయి. కొంత కాలం కిందట వైవీ ఆదేశించడం, అధికారులు స్వామి భక్తి చాటుకుంటూ ప్రజా ధనాన్ని వెచ్చించి ఈ రోడ్డు నిర్మించడం చకచకా జరిగిపోయాయి. ఇదీ.. సంగతి!!
This post was last modified on February 13, 2024 4:42 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…