ఏపీలో రహదారులు బాగోలేదని.. ఎక్కడికక్కడ గుంతలు.. అతుకులే కనిపిస్తున్నాయని.. కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాలు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదు. అంతేకాదు.. అసలు ఎవరు ఎన్ని మాటలు అన్నా.. పట్టించుకున్న దాఖలా కూడా లేదు. పోనీ.. ఎన్నికలకు ముందైనా.. రహదారులను పట్టించుకుంటారని.. రోడ్లు వేస్తారని అనుకుందామన్నా.. అసలు ఆ ఊసే లేకుండా పోయింది.
పోనీలే.. సంక్షేమ పథకాలకు నిధులు చాలక.. రోడ్లు వేయడం లేదేమో.. అని సరిపెట్టుకుందామా? అంటే.. అయిన వారి ఇళ్లకు.. కావాల్సిన వారి ఫాం హౌస్లకు ప్రభుత్వం తన సొంత నిధులతో రహదారు లను అద్దంలా నిర్మిస్తోంది. కొన్నాళ్ల కిందట మంత్రి బొత్స ఇంటి ముందు.. రోడ్డు వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు సీఎం జగన్ చిన్నాన్న.. వైసీపీ కీలక నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఫాం హౌస్(వ్యవసాయ క్షేత్రం) కు సర్కారు.. అద్దం లాంటి రోడ్డు నిర్మించడం మరింత చర్చకు దారితీసింది.
ఎక్కడంటే..
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు పంచాయతీ పరిధిలో వైసీపీముఖ్య నాయకుడు.. కాలం కలిసి వస్తే. త్వరలోనే రాజ్యసభకు కూడా వెళ్లనున్న వైవీ సుబ్బారెడ్డి సోదరులకు సుమారు వంద ఎకరాల మేర ఫాం హౌస్లు, పండ్ల తోటలు ఉన్నాయి. అక్కడకు చేరుకునేందుకు గతంలో మట్టి రోడ్డు ఉండేది. ఇటీవల ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి 2.5 కి.మీ. మేర రోడ్డు వేసేశారు.
వాస్తవానికి ఈ మార్గంలో ఒక్క ఇల్లు లేకపోయినా సరే వైవీ సోదరుల కోసమే దీనిని నిర్మించారనే విమర్శలు వస్తున్నాయి. కొంత కాలం కిందట వైవీ ఆదేశించడం, అధికారులు స్వామి భక్తి చాటుకుంటూ ప్రజా ధనాన్ని వెచ్చించి ఈ రోడ్డు నిర్మించడం చకచకా జరిగిపోయాయి. ఇదీ.. సంగతి!!
This post was last modified on February 13, 2024 4:42 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…