ఏపీలో రహదారులు బాగోలేదని.. ఎక్కడికక్కడ గుంతలు.. అతుకులే కనిపిస్తున్నాయని.. కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాలు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదు. అంతేకాదు.. అసలు ఎవరు ఎన్ని మాటలు అన్నా.. పట్టించుకున్న దాఖలా కూడా లేదు. పోనీ.. ఎన్నికలకు ముందైనా.. రహదారులను పట్టించుకుంటారని.. రోడ్లు వేస్తారని అనుకుందామన్నా.. అసలు ఆ ఊసే లేకుండా పోయింది.
పోనీలే.. సంక్షేమ పథకాలకు నిధులు చాలక.. రోడ్లు వేయడం లేదేమో.. అని సరిపెట్టుకుందామా? అంటే.. అయిన వారి ఇళ్లకు.. కావాల్సిన వారి ఫాం హౌస్లకు ప్రభుత్వం తన సొంత నిధులతో రహదారు లను అద్దంలా నిర్మిస్తోంది. కొన్నాళ్ల కిందట మంత్రి బొత్స ఇంటి ముందు.. రోడ్డు వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు సీఎం జగన్ చిన్నాన్న.. వైసీపీ కీలక నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఫాం హౌస్(వ్యవసాయ క్షేత్రం) కు సర్కారు.. అద్దం లాంటి రోడ్డు నిర్మించడం మరింత చర్చకు దారితీసింది.
ఎక్కడంటే..
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు పంచాయతీ పరిధిలో వైసీపీముఖ్య నాయకుడు.. కాలం కలిసి వస్తే. త్వరలోనే రాజ్యసభకు కూడా వెళ్లనున్న వైవీ సుబ్బారెడ్డి సోదరులకు సుమారు వంద ఎకరాల మేర ఫాం హౌస్లు, పండ్ల తోటలు ఉన్నాయి. అక్కడకు చేరుకునేందుకు గతంలో మట్టి రోడ్డు ఉండేది. ఇటీవల ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి 2.5 కి.మీ. మేర రోడ్డు వేసేశారు.
వాస్తవానికి ఈ మార్గంలో ఒక్క ఇల్లు లేకపోయినా సరే వైవీ సోదరుల కోసమే దీనిని నిర్మించారనే విమర్శలు వస్తున్నాయి. కొంత కాలం కిందట వైవీ ఆదేశించడం, అధికారులు స్వామి భక్తి చాటుకుంటూ ప్రజా ధనాన్ని వెచ్చించి ఈ రోడ్డు నిర్మించడం చకచకా జరిగిపోయాయి. ఇదీ.. సంగతి!!
This post was last modified on February 13, 2024 4:42 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…