Political News

నోరుందని మాట్లాడకు రోజా..షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్

తనపై విమర్శలు చేసే వారిని ఏ మాత్రం వదలని తీరు ఏపీ పీసీసీ రథసారధి షర్మిలలో కనిపిస్తుంటుంది. తనను అనే ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చుకునే ఆమె తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజాపై విరుచుకుపడ్డారు. ఆమెపై ఘాటు విమర్శలు చేసిన షర్మిల.. సంచలన ఆరోపణలు చేశారు.

ఇప్పటివరకు రోజాపై ఎవరు చేయని సరికొత్త ఆరోపణలకు తెర తీశారు. ‘‘నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా. నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ.. ఈవిడతో పాటు రోజా అన్నలు, భర్త కలిపి నగరి నియోజకవర్గానికి నలుగురు మంత్రులు. ఇసుక, మట్టి, గ్రావెల్, స్థలాలు ఇలా అన్నీ దోపిడీ. ఎక్కడ చూసినా అవినీతే” అంటూ ఫైర్ అయ్యారు.

రోజాను ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనే వారన్న విషయాన్ని గుర్తు చేసిన షర్మిల.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పంచె విప్పి కొడతానంటూ ఆమె చేసిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదన్నారు. తనను ప్రేమించినంతగా వైఎస్సార్ ఎవరినీ ప్రేమించలేదన్న ఆమె.. ‘‘నోరుంది కదా అని పారేసుకోకు. తెలంగాణలో నాపై అధిక ప్రసంగం చేసిన వాళ్లను జనాలు ఓడగొట్టిన విషయాన్ని గుర్తుంచుకో. వారంతా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు. రేపు రోజా గతి కూడా అంతే. బాపట్లలో ఒకతను నాపై ఇష్టానుసారం మాట్లాడాడు. వైఎస్సార్ బిడ్డను కాబట్టే అడుగు బయట పెట్టగలిగిందన్నాడు. ఒక్క నిమిషం నేను వైఎస్సార్ బిడ్డను కాదనే విషయాన్ని పక్కన పెడతా. ఎవరొస్తారో.. ఎంతమంది వస్తారో రండి. ఎవరేంటో చూసుకుందాం’’ అని నిప్పులు చెరిగారు.

వైసీపీ కోసం తాను మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్న షర్మిల.. వైసీపీ మొక్కగా ఉన్నప్పుడు తాను ఎరువు వేశానని చెప్పారు. ‘ఇప్పుడు చెట్టు అయ్యాక నా అవసరం లేదంటున్నారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీని మూసేశారంటూ చేస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశానని.. కాంగ్రెస్ ఉన్నంతవరకు తమ పార్టీ ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు.

గొప్ప ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీని విలీనం చేశానని చెప్పిన షర్మిల.. ‘ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్నీ వస్తాయి. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన డబ్బులు తేవాలంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నేను డబ్బులు తీసుుకొస్తే మీరేమైనా గాడిదలు కాస్తున్నారా? కేసీఆర్ తో ఇన్నాళ్లు స్నేహం చేశారు కదా. మరి రాష్ట్ర విభజన సమస్యలు అప్పడు కనిపించలేదా?’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

This post was last modified on February 12, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

2 minutes ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

1 hour ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

2 hours ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

3 hours ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

3 hours ago