Political News

13వ తేదీ బిగ్ ఫైట్  ?

13వ తేదీన ఒకేరోజు  తెలంగాణాలో రెండు కీలకమైన ఘటనలు జరగబోతున్నాయి. మొదటిదేమో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజి సందర్శన. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతిని వివరించేందుకు రేవంత్ రెడీ అయ్యారు. నాసిరకం నిర్మాణం కారణంగానే కొన్ని పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై జరిగిన విజిలెన్స్ విచారణలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు నిర్ధారణయ్యింది. నివేదిక ప్రకారం సుమారు రు. 4 వేల కోట్ల దోపిడి జరిగిందట.

విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా విచారణను మరింత లోతుగా చేయించాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకనే ప్రాధమికంగా ఇరిగేషన్ రంగంలోని నిపుణులు, అధికారపార్టీ నేతలతో కలిసి రేవంత్ బ్యారేజిని సందర్శించబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి జరిగిన అవినీతిపై చాలా డీటైల్డ్ గా రేవంత్ జనాలకు  వివరించబోతున్నారు. అదే రోజు నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరగబోతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మొదలవ్వబోతున్న ప్రచార సభలో కేసీయార్ పాల్గొనబోతున్నారు.

ప్రమాదం జరిగి విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీయార్ పాల్గొనబోతున్న మొదటి బహిరంగసభ ఇదే. అందుకనే సుమారు 2 లక్షల మంది జనసీమకరణతో భారీ బహిరంగసభకు పార్టీ ప్లాన్ చేసింది. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుండి బహిరంగసభకు జనాలను సమీకరించేందుకు కేసీయార్ ఇదివరకే నియోజకవర్గాల ఇన్చార్జీలను కూడా నియమించారు. తెలంగాణాలోని నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించటంపై కేసీయార్ ఎక్కువగా టార్గెట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల నీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది ? దక్షణి తెలంగానా ఎడారిగా మారబోతోందన్న విషయాన్ని జనాలకు వివరించేందుకు కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి రేవంత్, కేసీయార్ మీటింగుల్లో  సబ్జెక్టు ఒకటేకాని భిన్న కోణాలను జనాలు చూడబోతున్నారు. కేసీయార్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతున్నారు. ఇదే సమయంలో రేవంతేమో ప్రాజెక్టుల దోపిడికి కేసీయార్ కుటుంబం పాల్పడిందన్న విషయాన్ని జనాలకు వివరించేందుకు అవసరమైన మెటీరియల్ ఇప్పటికే కలెక్టు చేశారు.  అందుకనే 13వ తేదీన రేవంత్-కేసీయార్ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోందనే ప్రచారం ఊపందుకుంది. 

This post was last modified on February 12, 2024 10:06 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

7 hours ago