13వ తేదీన ఒకేరోజు తెలంగాణాలో రెండు కీలకమైన ఘటనలు జరగబోతున్నాయి. మొదటిదేమో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజి సందర్శన. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతిని వివరించేందుకు రేవంత్ రెడీ అయ్యారు. నాసిరకం నిర్మాణం కారణంగానే కొన్ని పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై జరిగిన విజిలెన్స్ విచారణలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు నిర్ధారణయ్యింది. నివేదిక ప్రకారం సుమారు రు. 4 వేల కోట్ల దోపిడి జరిగిందట.
విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా విచారణను మరింత లోతుగా చేయించాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకనే ప్రాధమికంగా ఇరిగేషన్ రంగంలోని నిపుణులు, అధికారపార్టీ నేతలతో కలిసి రేవంత్ బ్యారేజిని సందర్శించబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి జరిగిన అవినీతిపై చాలా డీటైల్డ్ గా రేవంత్ జనాలకు వివరించబోతున్నారు. అదే రోజు నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరగబోతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మొదలవ్వబోతున్న ప్రచార సభలో కేసీయార్ పాల్గొనబోతున్నారు.
ప్రమాదం జరిగి విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీయార్ పాల్గొనబోతున్న మొదటి బహిరంగసభ ఇదే. అందుకనే సుమారు 2 లక్షల మంది జనసీమకరణతో భారీ బహిరంగసభకు పార్టీ ప్లాన్ చేసింది. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుండి బహిరంగసభకు జనాలను సమీకరించేందుకు కేసీయార్ ఇదివరకే నియోజకవర్గాల ఇన్చార్జీలను కూడా నియమించారు. తెలంగాణాలోని నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించటంపై కేసీయార్ ఎక్కువగా టార్గెట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల నీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది ? దక్షణి తెలంగానా ఎడారిగా మారబోతోందన్న విషయాన్ని జనాలకు వివరించేందుకు కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి రేవంత్, కేసీయార్ మీటింగుల్లో సబ్జెక్టు ఒకటేకాని భిన్న కోణాలను జనాలు చూడబోతున్నారు. కేసీయార్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతున్నారు. ఇదే సమయంలో రేవంతేమో ప్రాజెక్టుల దోపిడికి కేసీయార్ కుటుంబం పాల్పడిందన్న విషయాన్ని జనాలకు వివరించేందుకు అవసరమైన మెటీరియల్ ఇప్పటికే కలెక్టు చేశారు. అందుకనే 13వ తేదీన రేవంత్-కేసీయార్ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోందనే ప్రచారం ఊపందుకుంది.
This post was last modified on February 12, 2024 10:06 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…