Political News

జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపుతా.. ష‌ర్మిల శ‌ప‌థం..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల తాజాగా శ‌ప‌థం చేశారు. ఇప్ప‌టి వ‌రకు వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన ష‌ర్మిల‌.. తాజాగా త‌న సోద‌రుడు, సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేస్తాన‌ని శప‌థం చేశారు. రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల‌లో భాగంగా ష‌ర్మిల‌.. తాజాగా తిరుప‌తి జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం(ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా నియోజ‌క‌వ‌ర్గం)లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఇక్క‌డి పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా తొలుత రోడ్ షోలో పాల్గొన్న ష‌ర్మిల‌.. అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా ఎంతో నష్టపోయాం. లేకపోతే వేల ఉద్యోగాలు వచ్చేవి. జగన్ ఓ నియంత. త్వరలోనే గద్దె దింపుతా. ఇది నా శ‌ప‌థం. మొన్న తెలంగాణలో నియంత కేసీఆర్‌ను గద్దె దింపా. త్వరలో ఏపీలో నియంతను గద్దె దింపడమే నా లక్ష్యం. వైఎస్సార్ ఆశయాలు అని అన్న ఎన్నో చెప్పారు, ఒక్క ఛాన్స్ అని అడిగారు.. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, సీఎం జగన్ కు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ హయాంలో రైతులకు సంక్షేమం, వారికి ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తనాల మీద, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చి వ్యవసాయం పండుగ చేశార‌ని చెప్పారు. కానీ, నేడు జ‌గ‌న్ హ‌యాంలో వ్యవసాయం దండగ అనేది దాగి ఉంద‌ని చెప్పారు. రాష్ట్రంలో అప్పులు లేని రైతు ఒక్కరు కూడా లేరని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. రూ.300 కోట్లతో రైతులకు స్థిరీకరణ నిధితో మద్దతు వచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. రూ.4000 కోట్లతో రైతులకు నష్టపరిహార నిధి అని చెప్పి, ఒక్క ఏడాది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేశారు. డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదని, మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఏది చదివినా ఉచితంగా చదించారని, కానీ జగన్ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదు అని ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.

ఇలాంటి పాల‌న మ‌న‌కు అవ‌స‌ర‌మా? ఇసుక దోచుకుంటున్నారు. మ‌ట్టి దోచుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల‌కు త‌ర‌లించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లా మ‌న‌కు నాయ‌కులు. ఈ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల్సిందే. నేను మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా.. ఇది నా శ‌ప‌థం అని ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానించారు. కాగా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల్సిందే అనే వ్యాఖ్య‌ల‌ను ఆమె 12 సార్లు చేయ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఇది నియంత ప్ర‌భుత్వం అని 10 సార్లు వ్యాఖ్యానించారు. చిత్రం ఏంటంటే.. ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు.. జ‌నాల నుంచి రియాక్ష‌న్ జోరుగా క‌నిపించింది.

This post was last modified on February 12, 2024 8:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

3 minutes ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

1 hour ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

2 hours ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

3 hours ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

3 hours ago