Political News

ప‌వ‌న్ అసెంబ్లీలో అడుగు పెడితే..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అసెంబ్లీలోకి అడుగు పెడ‌తారా? ఆయ‌న అడుగు పెడితే ఎలా ఉం టుంది? కొన్నాళ్లుగా ఏపీలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. ముఖ్యంగా జ‌న‌సేన నాయ‌కుల్లో ఈ చ‌ర్చ ఎక్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం సినీ రంగానికి చెందిన ఒక్క బాల‌కృష్ణ టీడీపీ త‌ర‌ఫున‌, వైసీపీ నుంచి మంత్రి రోజాలు మాత్ర‌మే స‌భ‌లో ఉన్నారు. రోజా దాదాపు సినిమాలు మానేసిన నేప‌థ్యంలో ఆమె పూర్తిగా రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు.

ఇక‌, బాల‌య్య మాత్రం రెండు ప‌డ‌వ‌ల‌పైనా నిర్విఘ్నంగా ప్ర‌యాణిస్తున్నారు. అసెంబ్లీలోనూ, సినిమాల్లో నూ ఆయ‌న త‌న‌దైన శైలిలో దూకుడుగా ఉన్నారు. వైసీపీకి వ్య‌తిరేకంగా కామెంట్లు చేయ‌డంలోనూ బాలయ్య స్ట‌యిలే వేరుగా ఉంది. ఇక‌, ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పవ‌న్ కూడా.. అసెంబ్లీలో అడుగు పెడితే బాగుంటుంద‌ని.. ఈ సారి ఖాయ‌మ‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న వాగ్ధాటి, సిద్ధాంతాలు వంటివి అసెంబ్లీకి ఎంతో ఉప‌క‌రిస్తాయ‌ని వారు అంటున్నారు.

ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌సంగాలు.. విన‌సొంపుగా ఉండ‌డ‌మే కాకుండా.. ఆలోచ‌నాత్మ‌కంగా ఉంటున్నాయ‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్.. రెండు చోట్లా ఓడిపోయారు. కానీ.. ఈ సారి మాత్రం గెలుపు ఖాయ‌మ‌నేది జ‌న‌సేన నాయ‌కుల టాక్‌. దీంతో ఆయ‌న అసెంబ్లీకి వ‌స్తే.. ప్ర‌భుత్వం త‌మ‌దైనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీదే అయినా.. ఒక స‌మంజ‌స‌మైన చ‌ర్చ‌ల‌కు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు స‌భ వేదిక‌య్యే అవ‌కాశం ఉంటుంద‌నేది జ‌న‌సేన నాయ‌కుల మాట‌.

ఇక‌, ప్ర‌జ‌ల్లోనూ ఓవ‌ర్గం వారు.. ప‌వ‌న్ పార్టీ ఎలా ఉన్నా…ఆయ‌న స‌భ‌లో ఉంటే బాగుంటుంద‌నే వాద‌న‌ను వినిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల‌మేరకు తిరుప‌తి నుంచి ప‌వ‌న్ పోటీ ఖాయంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఈ దఫా అన‌కాప‌ల్లిని ఆయ‌న ఎంచుకోనున్నారు. ఈ రెండు చోట్ల గెలిస్తే.. తిరుప‌తిని ఉంచుకునే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. ఆయ‌న అసెంబ్లీలో అడుగు పెట్ట‌డం ఖాయ‌మ‌ని జ‌న‌సేన అంచ‌నా వేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 11, 2024 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

2 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

6 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

8 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

12 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

14 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

14 hours ago