వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ పెట్టుకుంటున్న పొత్తులతో ఆ పార్టీ నాయకులు చాలా వరకు సీట్ల ను వదులుకోవాల్సి వస్తోంది. ఇది ఎంతగా అంటే.. కృష్నా జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా.. పెద్ద ఎత్తున కీలక స్థానాలను వదిలేయాల్సి వస్తోంది. గతంలో అయితే.. టీడీపీకి అటు ఇటుగా ఉన్న స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారనే అపవాదు ఉంది. కానీ, ఇప్పుడు మిత్రపక్షాలు కూడా.. తెలివిగా వ్యవహరిస్తున్నాయి. తమకు బలం ఎలా ఉన్నా.. టీడీపీ బలం ఉన్న చోట స్థానాలనే కోరుతున్నాయి.
ఉదాహరణకు.. పెడన నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ, దీనిని జనసేన పట్టుబడుతోంది. కైకలూరు నియోజకవర్గం టీడీపీ నేతల హవా ఎక్కువగా ఉన్న స్థానం. దీనిని బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజయవాడ ఎంపీ స్థానం.. టీడీపీ సిట్టింగు స్థానం. కానీ, దీనిని ఇచ్చి తీరాలని బీజేపీ అల్టిమేట్ జారీ చేస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, ఇదే జిల్లాలోని టీడీపీ కచ్చితంగా గెలుస్తుందనే అంచనా ఉన్న.. మచిలీపట్నం టికెట్ను జనసేనకు ఇచ్చే శారు.
అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గం పరిస్థితి కూడా డోలాయమానంలో ఉంది. ఇక, ఉమ్మడి పశ్చిమ లోనూ తాడేపల్లి గూడెం నుంచి ఆచంట వరకు.. సుమారు నాలుగు స్థానాలను జనసే న కోరుతోంది. అదేవిధంగా టీడీపీకి కంచుకోటల వంటి.. తూర్పుగోదావరి జిల్లాల్లోని రాజమండ్రి స్థానాన్ని.. జనసేనకు ఇప్పటికే ఇచ్చారు. అయినా.. ఎంపీ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే.. దీనిపై టీడీపీ నిక్కచ్చిగా.. కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు.. గుంటూరు స్థానం ఎంపీ టికెట్ను ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆయనను ఆగాలంటూ.. పైనుంచి ఆదేశాలు రావడం గమనార్హం. ఇక్కడ నుంచి బీజేపీ పోటీ చేయాలని చూస్తోంది. పురందేశ్వరి కి విశాఖను ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి ఈ టికెట్ను బాలయ్య అల్లుడు.. భరత్కు కేటాయించారు. కానీ, ఈ సారి తప్పదని.. బీజేపీ పట్టుబడుతోంది. ఇలా.. మొత్తంగా టీడీపీ కంచుకోటలపైనే.. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…