వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ పెట్టుకుంటున్న పొత్తులతో ఆ పార్టీ నాయకులు చాలా వరకు సీట్ల ను వదులుకోవాల్సి వస్తోంది. ఇది ఎంతగా అంటే.. కృష్నా జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా.. పెద్ద ఎత్తున కీలక స్థానాలను వదిలేయాల్సి వస్తోంది. గతంలో అయితే.. టీడీపీకి అటు ఇటుగా ఉన్న స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారనే అపవాదు ఉంది. కానీ, ఇప్పుడు మిత్రపక్షాలు కూడా.. తెలివిగా వ్యవహరిస్తున్నాయి. తమకు బలం ఎలా ఉన్నా.. టీడీపీ బలం ఉన్న చోట స్థానాలనే కోరుతున్నాయి.
ఉదాహరణకు.. పెడన నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ, దీనిని జనసేన పట్టుబడుతోంది. కైకలూరు నియోజకవర్గం టీడీపీ నేతల హవా ఎక్కువగా ఉన్న స్థానం. దీనిని బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజయవాడ ఎంపీ స్థానం.. టీడీపీ సిట్టింగు స్థానం. కానీ, దీనిని ఇచ్చి తీరాలని బీజేపీ అల్టిమేట్ జారీ చేస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, ఇదే జిల్లాలోని టీడీపీ కచ్చితంగా గెలుస్తుందనే అంచనా ఉన్న.. మచిలీపట్నం టికెట్ను జనసేనకు ఇచ్చే శారు.
అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గం పరిస్థితి కూడా డోలాయమానంలో ఉంది. ఇక, ఉమ్మడి పశ్చిమ లోనూ తాడేపల్లి గూడెం నుంచి ఆచంట వరకు.. సుమారు నాలుగు స్థానాలను జనసే న కోరుతోంది. అదేవిధంగా టీడీపీకి కంచుకోటల వంటి.. తూర్పుగోదావరి జిల్లాల్లోని రాజమండ్రి స్థానాన్ని.. జనసేనకు ఇప్పటికే ఇచ్చారు. అయినా.. ఎంపీ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే.. దీనిపై టీడీపీ నిక్కచ్చిగా.. కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు.. గుంటూరు స్థానం ఎంపీ టికెట్ను ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆయనను ఆగాలంటూ.. పైనుంచి ఆదేశాలు రావడం గమనార్హం. ఇక్కడ నుంచి బీజేపీ పోటీ చేయాలని చూస్తోంది. పురందేశ్వరి కి విశాఖను ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి ఈ టికెట్ను బాలయ్య అల్లుడు.. భరత్కు కేటాయించారు. కానీ, ఈ సారి తప్పదని.. బీజేపీ పట్టుబడుతోంది. ఇలా.. మొత్తంగా టీడీపీ కంచుకోటలపైనే.. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on February 11, 2024 2:35 pm
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…