వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ పెట్టుకుంటున్న పొత్తులతో ఆ పార్టీ నాయకులు చాలా వరకు సీట్ల ను వదులుకోవాల్సి వస్తోంది. ఇది ఎంతగా అంటే.. కృష్నా జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా.. పెద్ద ఎత్తున కీలక స్థానాలను వదిలేయాల్సి వస్తోంది. గతంలో అయితే.. టీడీపీకి అటు ఇటుగా ఉన్న స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారనే అపవాదు ఉంది. కానీ, ఇప్పుడు మిత్రపక్షాలు కూడా.. తెలివిగా వ్యవహరిస్తున్నాయి. తమకు బలం ఎలా ఉన్నా.. టీడీపీ బలం ఉన్న చోట స్థానాలనే కోరుతున్నాయి.
ఉదాహరణకు.. పెడన నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ, దీనిని జనసేన పట్టుబడుతోంది. కైకలూరు నియోజకవర్గం టీడీపీ నేతల హవా ఎక్కువగా ఉన్న స్థానం. దీనిని బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజయవాడ ఎంపీ స్థానం.. టీడీపీ సిట్టింగు స్థానం. కానీ, దీనిని ఇచ్చి తీరాలని బీజేపీ అల్టిమేట్ జారీ చేస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, ఇదే జిల్లాలోని టీడీపీ కచ్చితంగా గెలుస్తుందనే అంచనా ఉన్న.. మచిలీపట్నం టికెట్ను జనసేనకు ఇచ్చే శారు.
అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గం పరిస్థితి కూడా డోలాయమానంలో ఉంది. ఇక, ఉమ్మడి పశ్చిమ లోనూ తాడేపల్లి గూడెం నుంచి ఆచంట వరకు.. సుమారు నాలుగు స్థానాలను జనసే న కోరుతోంది. అదేవిధంగా టీడీపీకి కంచుకోటల వంటి.. తూర్పుగోదావరి జిల్లాల్లోని రాజమండ్రి స్థానాన్ని.. జనసేనకు ఇప్పటికే ఇచ్చారు. అయినా.. ఎంపీ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే.. దీనిపై టీడీపీ నిక్కచ్చిగా.. కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు.. గుంటూరు స్థానం ఎంపీ టికెట్ను ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆయనను ఆగాలంటూ.. పైనుంచి ఆదేశాలు రావడం గమనార్హం. ఇక్కడ నుంచి బీజేపీ పోటీ చేయాలని చూస్తోంది. పురందేశ్వరి కి విశాఖను ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి ఈ టికెట్ను బాలయ్య అల్లుడు.. భరత్కు కేటాయించారు. కానీ, ఈ సారి తప్పదని.. బీజేపీ పట్టుబడుతోంది. ఇలా.. మొత్తంగా టీడీపీ కంచుకోటలపైనే.. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on February 11, 2024 2:35 pm
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…