వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ పెట్టుకుంటున్న పొత్తులతో ఆ పార్టీ నాయకులు చాలా వరకు సీట్ల ను వదులుకోవాల్సి వస్తోంది. ఇది ఎంతగా అంటే.. కృష్నా జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా.. పెద్ద ఎత్తున కీలక స్థానాలను వదిలేయాల్సి వస్తోంది. గతంలో అయితే.. టీడీపీకి అటు ఇటుగా ఉన్న స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారనే అపవాదు ఉంది. కానీ, ఇప్పుడు మిత్రపక్షాలు కూడా.. తెలివిగా వ్యవహరిస్తున్నాయి. తమకు బలం ఎలా ఉన్నా.. టీడీపీ బలం ఉన్న చోట స్థానాలనే కోరుతున్నాయి.
ఉదాహరణకు.. పెడన నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ, దీనిని జనసేన పట్టుబడుతోంది. కైకలూరు నియోజకవర్గం టీడీపీ నేతల హవా ఎక్కువగా ఉన్న స్థానం. దీనిని బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజయవాడ ఎంపీ స్థానం.. టీడీపీ సిట్టింగు స్థానం. కానీ, దీనిని ఇచ్చి తీరాలని బీజేపీ అల్టిమేట్ జారీ చేస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, ఇదే జిల్లాలోని టీడీపీ కచ్చితంగా గెలుస్తుందనే అంచనా ఉన్న.. మచిలీపట్నం టికెట్ను జనసేనకు ఇచ్చే శారు.
అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గం పరిస్థితి కూడా డోలాయమానంలో ఉంది. ఇక, ఉమ్మడి పశ్చిమ లోనూ తాడేపల్లి గూడెం నుంచి ఆచంట వరకు.. సుమారు నాలుగు స్థానాలను జనసే న కోరుతోంది. అదేవిధంగా టీడీపీకి కంచుకోటల వంటి.. తూర్పుగోదావరి జిల్లాల్లోని రాజమండ్రి స్థానాన్ని.. జనసేనకు ఇప్పటికే ఇచ్చారు. అయినా.. ఎంపీ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే.. దీనిపై టీడీపీ నిక్కచ్చిగా.. కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు.. గుంటూరు స్థానం ఎంపీ టికెట్ను ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆయనను ఆగాలంటూ.. పైనుంచి ఆదేశాలు రావడం గమనార్హం. ఇక్కడ నుంచి బీజేపీ పోటీ చేయాలని చూస్తోంది. పురందేశ్వరి కి విశాఖను ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి ఈ టికెట్ను బాలయ్య అల్లుడు.. భరత్కు కేటాయించారు. కానీ, ఈ సారి తప్పదని.. బీజేపీ పట్టుబడుతోంది. ఇలా.. మొత్తంగా టీడీపీ కంచుకోటలపైనే.. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on February 11, 2024 2:35 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…