గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్ననే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సడెన్ గా రేవంత్ రెడ్డిని కలిసారు. ముఖ్యమంత్రితో తన సమావేశం పూర్తిగా అధికారికమే అని గద్వాల చెబుతున్నా ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎవరు ఏ కారణంతో కలిసినా చెప్పేది మాత్రం అధికారికమని, నియోజకవర్గాలకు నిధుల కోసమనే చెబుతారు.
అలాగే రెండు రోజుల క్రితమే మాజీ డిప్యుటి మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈయనకు ముస్లిం కార్పొరేటర్లలో మంచి పట్టుంది. రెండు రోజుల క్రితం గ్రేటర్ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో కేటీయార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యుటి మేయర్ శ్రీలతో పాటు మరికొందరు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరుతో పార్టీలో పెద్ద కలకలం మొదలైంది. తమవ్యక్తిగత కారణాలతోనే తాను సమావేశానికి హాజరుకాలేకపోయినట్లు డిప్యుటి మేయర్ చెప్పినా ఎవరు నమ్మటంలేదు.
ప్రస్తుతం పరిస్ధితులు ఎలాగున్నాయంటే ఏ కారణంతో ప్రతిపక్షాల నేతలు ముఖ్యమంత్రిని కలిసినా పార్టీ మారిపోవటం ఖాయమనే ప్రచారమైతే జరిగిపోతోంది. దీనికి మూల కారణం ఏమిటంటే రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో అవిశ్వాసతీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ ఛైర్మన్లను దింపేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మున్సిపాలిటిల్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిపోయి అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఛైర్మన్లను దింపేశారు. దాంతో లాటరీ తగిలినట్లుగా సుమారు 20 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఒక్కో మున్సిపాలిటి కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నపుడు ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ను మాత్రం కాంగ్రెస్ ఎందుకు వదులుతుంది.
ఇందులో భాగంగానే మేయర్ గద్వాల రేవంత్ ను కలవటం, వెంటనే మాజీ మేయర్ కాంగ్రెస్ లో చేరటం, కేటీయార్ మీటింగుకు డిప్యుటి మేయర్, కొందరు కార్పొరేటర్లు గైర్హాజరవటం అనే ప్రచారం పెరిగిపోతోంది. ఒక సమాచారం ప్రకారం బీఆర్ఎస్ కు చెందిన 56 మంది కార్పొరేటర్లలో 26 మంది కాంగ్రెస్ లోకి జంప్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఎంఐఎం సహకారం కూడా ఓకే అయిపోతే ఆ ముచ్చటేదో అయిపోతుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 11, 2024 10:54 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…